NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / అరుదైన రికార్డును సృష్టించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి జోడీ..!
    తదుపరి వార్తా కథనం
    అరుదైన రికార్డును సృష్టించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి జోడీ..!
    అరుదైన రికార్డును సృష్టించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

    అరుదైన రికార్డును సృష్టించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి జోడీ..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 12, 2023
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ క్రికెట్లోని అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుర్తింపును పొందారు. ఇప్పటివరకూ వీరు క్రికెట్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టారు.

    నేడు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో వీరిద్దరూ కలిసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. వన్డేల్లో వేగంగా 5వేలు పరుగులు చేసిన జోడిగా వరల్డ్ రికార్డును క్రియేట్ చేశారు.

    వెస్టిండీస్ దిగ్గజాలు గోర్డాన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్‌లను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అధిగమించడం విశేషం.

    కొన్నేళ్లుగా కోహ్లీ,రోహిత్ వన్డే ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. రోహిత్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించగా, కోహ్లీ ఒంటో చెత్తో భారత జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.

    ఇక వన్డే ఫార్మాట్లో 5,000 పరుగులు పూర్తి చేసిన ఎనిమిదో జోడీగా వీరిద్దరూ రికార్డెక్కారు.

    Details

    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

    భారత్ తరుపున అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న భారత జోడిగా రోహిత్, కోహ్లీ రికార్డు సృష్టించారు.

    వీరిద్దరూ కేవలం 86 ఇన్నింగ్స్‌లోనే 5వేల మార్కును అందుకున్నారు. గ్రీనిడ్జ్, హేన్స్ గతంలో ఈ రికార్డును (97 ఇన్నింగ్స్‌లో) అందుకున్నారు.

    ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ 104 ఇన్నింగ్స్‌లు ఆ మార్కుకు చేరుకోగా, శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్, కుమార సంగక్కర ఈ మార్కు కోసం 105 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

    వన్డేల్లో 5,000 పరుగులు చేసిన మూడో భారత జోడీగా కోహ్లీ-రోహిత్ నిలిచారు.

    గంగూలీ, సచిన్ వన్డే క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్య పరుగులు (8,227) కలిగి ఉన్నారు.

    ఇక శిఖర్ ధావన్, రోహిత్ వన్డేల్లో 5,193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    రోహిత్ శర్మ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    విరాట్ కోహ్లీ

    వావ్ సూపర్ ఇన్నింగ్స్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే : విరాట్ కోహ్లీ ఐపీఎల్
    ఆ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడ్చానా అనిపించింది : విరాట్ కోహ్లీ టీమిండియా
    టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ తప్పుకోవాలన్న రవిశాస్త్రి.. లేదంటే! రోహిత్ శర్మ
    బౌలింగ్ పై నమ్మకం పెంచుకున్న కోహ్లీ: 40పరుగులకే ఆలౌట్ చేసేవాడినంటూ కామెంట్స్  ఐపీఎల్

    రోహిత్ శర్మ

    రోహిత్ శర్మ Vs హార్ధిక్ పాండ్యా.. గురు శిష్యుల్లో ఎవరు పైచేయి సాధిస్తారో! గుజరాత్ టైటాన్స్
    రోహిత్ విశ్రాంతి తీసుకో.. లేకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో కష్టమే! టీమిండియా
    రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్  పుట్టినరోజు
    రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025