టెస్టు క్రికెట్లో పాకిస్థాన్ తొలి కీపర్గా సర్పరాజ్ అహ్మద్ రికార్డు
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ అద్భుత రికార్డును సృష్టించాడు. గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా మొదటి టెస్టులో శ్రీలంక, పాకిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచులో 15 బంతుల్లో 17 పరుగులు చేసి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్లో 3వేలు పరుగులు పూర్తి చేసిన తొలి పాకిస్థాన్ కీపర్ గా సర్ఫారాజ్ అహ్మద్ రికార్డుకెక్కాడు. ఇప్పటివరకూ 55 టెస్టుల్లో 38.57 సగటుతో 3,009 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలను బాదాడు. సర్ఫరాజ్ 2010లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. అయితే మళ్లీ రెండో టెస్టు మ్యాచ్ ఆడటానికి మూడేళ్లుగా పైగా వేచి ఉండాల్సి వచ్చింది
శ్రీలంక 312 పరుగులకు ఆలౌట్
2017లో పాకిస్థాన్ టెస్టు కెప్టెన్గా ఎంపికైన సర్ఫరాజ్ అహ్మద్ ఫేలవ ఫామ్ కారణంగా 2019లో టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. గతేడాది న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అతను వరుసగా 86, 53, 78, 118 పరుగులు సాధించి సత్తా చాటాడు. దీంతో ఆ సిరీస్లో 335 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు. సర్ఫరాజ్ శ్రీలంకపై ఇప్పటివరకూ 10 టెస్టులు ఆడి 49.26 సగటుతో 739 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఒక సెంచరీని బాదాడు. మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం పాకిస్థాన్ 157 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది.