NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై
    తదుపరి వార్తా కథనం
    హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై
    హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై

    హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 30, 2023
    12:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.

    రాబోయే దేశవాళీ సీజన్ లో ఆంధ్ర జట్టు కాకుండా మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాలని హనుమ విహారి నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    ఇన్నాళ్లూ ఆంధ్రా జట్టుకు ఆడిన అతను ఇక నుంచి మధ్యప్రదేశ్ జట్టుకు ఆడనున్నాడు. దీనిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఈఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో నివేదించింది.

    విహారి టీమిండియా తరుపున 16 టెస్టుల్లో 839 పరుగులు చేశాడు. అయితే గతేడాది ఇంగ్లండ్ తో జరిగిన చివరి టెస్టు నుంచి అతను భారత జట్టులో చోటు కోల్పోయాడు. ఫామ్ కోల్పోవడంతో సెలెక్టర్లు అప్పట్లో అతనిపై వేటు వేశారు.

    Details

    ఆంధ్ర జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ

    బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు ఈ ఏడాది విహారిని తొలగించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల విహారి ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2023లో సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

    ఇప్పటికే రజత్ పటిదార్, వెంకటేశ్ అయ్యర్, శుభమ్ వర్మ లాంటి బ్యాటర్లు ఉన్న మధ్యప్రదేశ్ జట్టులో విహారి రాకతో మరింత పటిష్టం కానుంది. ఇప్పటి వరకు 113 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో అతను 8600 పరుగులు చేశారు. ఇందులో 23 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలున్నాయి.

    హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ నేతృత్వంలో మధ్యప్రదేశ్ 2022 రంజీ ట్రోఫీ టైటిల్ ను గెలుచుకుంది. విహారి ఆంధ్రా జట్టును వదలడంతో ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    టీమిండియా

    సమిష్టి నిర్ణయంతోనే రాయుడిని తప్పించాం.. నా తప్పు లేదు : ఎమ్మెస్కే  క్రికెట్
    11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు  క్రికెట్
    ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న అంజిక్యా రహానే అంజిక్యా రహానే
    క్రికెట్లోనే కాదు ఆదాయంలోనూ కింగే.. కోహ్లీ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే! విరాట్ కోహ్లీ

    క్రికెట్

    ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆగస్టు 31 నుంచి ప్రారంభం టీమిండియా
    డబ్ల్యూటీసీ ఎఫెక్టు: పుజారా ఔట్.. యశస్వీ ఇన్ టీమిండియా
    4 నెలల్లో 12 వన్డేలు ఆడనున్న టీమిండియా.. ఏ జట్టుతో ఎన్ని మ్యాచులంటే? టీమిండియా
    టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025