NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Anantapur: తెలుగు క్రికెట్ అభిమానులకు పండగే.. అనంతపురంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు..  
    తదుపరి వార్తా కథనం
    Anantapur: తెలుగు క్రికెట్ అభిమానులకు పండగే.. అనంతపురంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు..  

    Anantapur: తెలుగు క్రికెట్ అభిమానులకు పండగే.. అనంతపురంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు..  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 03, 2024
    02:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అనంతపురానికి టీమిండియా క్రికెటర్లు వచ్చారు. దులీప్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ ఆటగాళ్లు ఇక్కడకు చేరుకున్నారు.

    ఈ నెల 5 నుంచి అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. టీమిండియా క్రికెటర్ల రాక తెలుగు క్రికెట్ అభిమానులకు పెద్ద ఆనందాన్ని కలిగించిందని చెప్పుకోవాలి.

    ఎందుకంటే, అందరి అభిమాన ఆటగాళ్లను ఒకే చోట చూడటానికి ఇదే మంచి అవకాశం.

    దేశవాళీ క్రికెట్‌లో కీలకమైన దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి 24 వరకు జరుగుతుంది. ఈ ట్రోఫీ కింద 6 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు అనంతపురంలోనే నిర్వహిస్తారు.

    వివరాలు 

    ఈ సారి దులీప్ ట్రోఫీ కొంత భిన్నంగా..

    ఇందులో టీమిండియా ప్రముఖ ఆటగాళ్లు పాల్గొంటున్నారు, వీరిలో కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ వంటి వారు ఉన్నారు.

    అయితే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు. ఈ సారి దులీప్ ట్రోఫీ కొంత భిన్నంగా ఉండనుంది.

    గతంలో ఈస్ట్,వెస్ట్,సౌత్, నార్త్,సెంట్రల్,నార్త్ ఈస్ట్ జోన్లు ఉండేవి.కానీ,ఈ సారి టీమిండియా ఆటగాళ్లు పాల్గొనడం వల్ల టోర్నీని ఇండియా A, B, C, D జట్లుగా విభజించారు.

    ఇందులో ఇండియా 'A' జట్టుకు శుభ్మన్ గిల్,'B' జట్టుకు అభిన్యు ఈశ్వరన్,'C' జట్టుకు రుతురాజ్ గైక్వాడ్, 'D' జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా ఉండనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అనంతపురం అర్బన్

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    అనంతపురం అర్బన్

    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం ఆంధ్రప్రదేశ్
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం  కర్నూలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025