Page Loader
AUS vs IND : టీమిండియా ఘోర ఓటమి.. ఆస్ట్రేలియాదే మెల్‌బోర్న్ టెస్టు
టీమిండియా ఘోర ఓటమి.. ఆస్ట్రేలియాదే మెల్‌బోర్న్ టెస్టు

AUS vs IND : టీమిండియా ఘోర ఓటమి.. ఆస్ట్రేలియాదే మెల్‌బోర్న్ టెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2024
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా - భారత జట్ల మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 155 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (84) పోరాడినా వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోరు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ (5 నాటౌట్: 45 బంతులు) క్రీజ్‌లో ఉన్నా మద్దతు లేకుండా పోయాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 3, బోలాండ్ 3, నాథన్ లైయన్ 2, స్టార్క్, హెడ్ చెరో వికెట్ తీశారు. రెండు ఇన్నింగ్స్‌లో, ఆసీస్ 474 పరుగులు సాధించి, భారత్ 369 పరుగులకు పరిమితమైంది.

Details

ఆధిక్యంలో ఆస్ట్రేలియా

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌటైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభంలో ఓర్పు ప్రదర్శించినా, దూకుడుగా ఆడే క్రమంలో కమిన్స్‌ చేతిలో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ (0) నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీకి రెండో ఇన్నింగ్స్‌లో జట్టును గెలిపించే బాధ్యత వచ్చినా స్టార్క్ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్‌కు వెళ్ళే బంతికి ఆడి ఔటయ్యాడు.

Details

9 వికెట్లతో రాణించిన బుమ్రా

పంత్ కూడా కీలక సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా ఈ పర్యటనలో 9 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన నితీశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే టాప్ ఆర్డర్ విఫలమవడంతో, వారి పోరాటం వృథా అయ్యింది.