NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్‌మనీ కంటే  మూడు రెట్లు! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్‌మనీ కంటే  మూడు రెట్లు! 
    టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్‌మనీ కంటే మూడు రెట్లు!

    Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్‌మనీ కంటే  మూడు రెట్లు! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 20, 2025
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)ను గెలుచుకొని విజేతగా నిలిచింది.

    ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయానికి గుర్తింపుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానాను ప్రకటించింది.

    ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

    జట్టు సభ్యులకు మొత్తం రూ.58 కోట్ల నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

    వివరాలు 

    వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న భారత ఆటగాళ్లు 

    ''రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టోర్నీ మొత్తం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఓటమి లేకుండా ట్రోఫీని గెలుచుకోవడం గర్వకారణం.బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో టోర్నీని ప్రారంభించిన భారత్,పాకిస్థాన్‌,న్యూజిలాండ్‌లను కూడా పరాజయపరిచింది.అనంతరం సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుని, అక్కడ న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న భారత ఆటగాళ్ల ప్రతిభను బోర్డు గుర్తించకుండా ఉండదు. వారి కృషికి పురస్కారంగా ఈ నగదు బహుమతిని అందిస్తున్నాం. జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఈ నజరానా ప్రకటించడం సంతోషంగా ఉంది. వారంతా దీనికి అర్హులే. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు ఎవరూ చేరనంత ఎత్తుకు ఎదుగుతోంది,'' అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.

    వివరాలు 

    రెండో ఐసీసీ టైటిల్‌

    విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు ఐసీసీ నుంచి రూ.19.50 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.

    ఫైనల్‌లో ఓడిపోయిన న్యూజిలాండ్‌కు రూ.9.70 కోట్ల వరకు లభించాయి.

    రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ వరుసగా ఒకే సంవత్సరంలో రెండో ఐసీసీ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    టీమిండియా

    తాజా

    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా
    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్

    బీసీసీఐ

    Dhoni: రొటేషన్ విధానంతోనే ప్రతి క్రికెటర్ కు అవకాశం : ధోనీ  ఎంఎస్ ధోని
    Byju's- BCCI: బైజూస్- బీసీసీఐ వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు బైజూస్‌
    BCCI: ఫీల్డింగ్‌లో 'పెనాల్టీ' పరుగులకు చెక్.. బీసీసీఐ నూతన మార్గదర్శకాలు క్రికెట్
    IND vs NZ 3rd Test: ముంబై టెస్టు పిచ్ రిపోర్ట్.. ఎవరికి అనుకూలంగా ఉందంటే? న్యూజిలాండ్

    టీమిండియా

    ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సమరానికి టీమిండియా సిద్ధం.. బంగ్లాపై ఆ ఆధిపత్యం కొనసాగేనా..?  బంగ్లాదేశ్
    Champions Trophy: టీమిండియా గేమ్‌ప్లాన్‌ సిద్ధం.. పిచ్‌ కండిషన్స్‌పై ఎఫెక్ట్‌? బంగ్లాదేశ్
    Rohit Sharma: బంగ్లాపై బరిలోకి రోహిత్ శర్మ.. ఊరిస్తున్న భారీ రికార్డులివే! రోహిత్ శర్మ
    IND vs BAN: బంగ్లా చిత్తు.. ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా బోణీ  ఛాంపియన్స్ ట్రోఫీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025