NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Asia Cup: పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే 
    తదుపరి వార్తా కథనం
    Asia Cup: పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే 
    పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే

    Asia Cup: పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 14, 2023
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా కప్‌లో భాగంగా మరో కీలక మ్యాచుకు వర్షం ఆటకం కలిగిస్తోంది. సూపర్-4లో భాగంగా ఇవాళ పాకిస్థాన్- శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.

    అయితే ఈ మ్యాచుకు వరుణుడు అడ్డుపడుతున్నాడు. దీంతో మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు.

    ఒకవేళ వర్షం తగ్గకపోతే ఈ మ్యాచుకు రిజర్వ్ డే లేదు. అదే జరిగితే ఇండియాతో ఫైనల్లో తలపడే మరో జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

    గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి 8 గంటలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    ఇక ఇరు జట్ల మధ్య 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది.

    Details

    శ్రీలంకకు ఫైనల్ చేరడానికి ఎక్కువ అవకాశాలు!

    ఇప్పటికే సూపర్-4 స్టేజ్‌లో రెండు మ్యాచులు గెలిచిన భారత్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ పూర్తిగా రద్దయితే.. పాకిస్థాన్ (-1.892) కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న శ్రీలంక (-0.200) ఫైనల్‌ కి చేరుకుంటుంది.

    టీమిండియా చేతిలో 228 పరుగుల భారీ తేడాతో పాక్ పరాజయం కావడంతో ఆ జట్టు నెట్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది.

    శ్రీలంకపై బాబర్ సేన నెగ్గితేనే ఫైనల్‌లో భారత్‌తో తలపడటానికి అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆసియా కప్ చరిత్రలో మొదటిసారిగా భారత్-పాకిస్థాన్ తలపడతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీలంక
    పాకిస్థాన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    శ్రీలంక

    NZ vs SL: తొలి టెస్టులో పట్టు బిగించిన శ్రీలంక క్రికెట్
    శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగ రికార్డును అధిగమించిన దినేష్ చండిమాల్ క్రికెట్
    టెస్టుల్లో ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత క్రికెట్
    టీమ్ ఓటమి కారణంగా కెప్టెన్సీకి రాజీనామా క్రికెట్

    పాకిస్థాన్

    పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు ఇండియా
    పాకిస్థాన్‌: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి  రైలు ప్రమాదం
    ఇమ్రాన్ ఖాన్‌ను ఏ జైలుకు పంపారు? ఎలాంటి సౌకర్యాలు కల్పించారంటే?  ఇమ్రాన్ ఖాన్
    పాకిస్థాన్‌: బలూచిస్థాన్‌‌లో బాంబు పేలుడు; ఏడుగురు మృతి తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025