Page Loader
Asia Cup: పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే 
పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే

Asia Cup: పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2023
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌లో భాగంగా మరో కీలక మ్యాచుకు వర్షం ఆటకం కలిగిస్తోంది. సూపర్-4లో భాగంగా ఇవాళ పాకిస్థాన్- శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచుకు వరుణుడు అడ్డుపడుతున్నాడు. దీంతో మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. ఒకవేళ వర్షం తగ్గకపోతే ఈ మ్యాచుకు రిజర్వ్ డే లేదు. అదే జరిగితే ఇండియాతో ఫైనల్లో తలపడే మరో జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి 8 గంటలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇరు జట్ల మధ్య 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది.

Details

శ్రీలంకకు ఫైనల్ చేరడానికి ఎక్కువ అవకాశాలు!

ఇప్పటికే సూపర్-4 స్టేజ్‌లో రెండు మ్యాచులు గెలిచిన భారత్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ పూర్తిగా రద్దయితే.. పాకిస్థాన్ (-1.892) కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న శ్రీలంక (-0.200) ఫైనల్‌ కి చేరుకుంటుంది. టీమిండియా చేతిలో 228 పరుగుల భారీ తేడాతో పాక్ పరాజయం కావడంతో ఆ జట్టు నెట్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. శ్రీలంకపై బాబర్ సేన నెగ్గితేనే ఫైనల్‌లో భారత్‌తో తలపడటానికి అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆసియా కప్ చరిత్రలో మొదటిసారిగా భారత్-పాకిస్థాన్ తలపడతాయి.