Page Loader
Virat Kohli: స‌చిన్ రికార్డు పై క‌న్ను.. మ‌రో మైలురాయికి చేరువ‌లో కోహ్లీ 
స‌చిన్ రికార్డు పై క‌న్ను.. మ‌రో మైలురాయికి చేరువ‌లో కోహ్లీ

Virat Kohli: స‌చిన్ రికార్డు పై క‌న్ను.. మ‌రో మైలురాయికి చేరువ‌లో కోహ్లీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2024
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభం అవుతుంది. పాకిస్థాన్‌ను తన గడ్డపై చిత్తుగా ఓడించి 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ మంచి ఊపులో ఉంది. భారత్ మీద కూడా తమ శక్తిని చాటాలని ఆ జట్టు ఆసక్తిగా ఉంది. అయితే, బంగ్లాదేశ్‌ను సీరియస్‌గా తీసుకుంటున్న టీమిండియా ఆటగాళ్లు పక్కా వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడనుండటం ఆసక్తి కలిగించే అంశం.

వివరాలు 

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 80 సెంచరీలు

టీ20 ఫార్మెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మెట్‌లపై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో, కోహ్లీ ఆటను టెస్ట్ మ్యాచ్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సచిన్ టెండుల్కర్‌ సృష్టించిన అనేక రికార్డులను కోహ్లీ బ్రేక్ చేశాడు. మరికొన్ని రికార్డులు కూడా ఊరిస్తున్నాయి సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల రికార్డును నెలకొల్పగా, 35 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 80 సెంచరీలు సాధించాడు. సచిన్ సెంచరీల రికార్డులను కోహ్లీ అధిగమించడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టే అవకాశముంది.

వివరాలు 

కోహ్లీకి ఇంకా 58 పరుగులు అవసరం

బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ సమయంలో మరో వరల్డ్ రికార్డు కూడా విరాట్ కోహ్లీని ఊరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగుల మైలురాయిని అధిగమించడానికి కోహ్లీకి ఇంకా 58 పరుగులు అవసరం. అత్యంత వేగంగా 27 వేల పరుగులు సాధించిన రికార్డు సచిన్ టెండుల్కర్‌ పేరు మీద ఉంది. 623 ఇన్నింగ్స్‌లో (226 టెస్ట్, 396 వన్డే, 1 టీ20) సచిన్ ఈ ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 591 ఇన్నింగ్స్ ఆడి 26,942 పరుగులు సాధించాడు. మరొక 58 పరుగులు చేసినా, సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది. ఈ రికార్డు విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.

వివరాలు 

ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ

మరో 8 ఇన్నింగ్స్‌లో కోహ్లీ 27 వేల పరుగుల మైలురాయిని అధిగమిస్తే,147 ఏళ్ల చరిత్రలో 600 ఇన్నింగ్స్‌లోపు ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సాధించనున్నాడు. ఇప్పటి వరకు సచిన్ టెండుల్కర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్లుగా ఉన్నారు. మరో 58 పరుగులు సాధిస్తే, విరాట్ కోహ్లీ కూడా వారి జాబితాలో చేరే అవకాశం ఉంది.