భారత్ పాక్ మ్యాచ్ ముగిశాక.. బాబర్ అజమ్ కు కోహ్లీ ఏం ఇచ్చాడో తెలుసా?
భారత్ పాకిస్థాన్ ప్రపంచ కప్-2023లో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఈ మేరకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిశాక టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మైదానంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా అజామ్ కోరిక మేరకు తన సంతకంతో కూడిన రెండు భారత జెర్సీలను అజామ్ కు బహుమతిగా అందించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అనంతరం ఇద్దరు స్టార్ ప్లేయర్లు కాసేపు ముచ్చటించారు.అయితే సాక్షాత్తు దాయాది దేశ సారథి భారత ఆటగాడి జెర్సీ అడగటం గమనార్హం. విరాట్ కోహ్లీ అభిమానుల్లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఒకరు.