NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Jai Shah: గౌరవంగా ఉంది.. టెస్టు క్రికెట్‌పై జై షా కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Jai Shah: గౌరవంగా ఉంది.. టెస్టు క్రికెట్‌పై జై షా కీలక వ్యాఖ్యలు
    గౌరవంగా ఉంది.. టెస్టు క్రికెట్‌పై జై షా కీలక వ్యాఖ్యలు

    Jai Shah: గౌరవంగా ఉంది.. టెస్టు క్రికెట్‌పై జై షా కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 28, 2024
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నూతన ఛైర్మన్‌గా జై షా ఎంపికయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా, డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

    ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికై అత్యంత పిన్న వయస్కుడిగా జై షా చరిత్ర సృష్టించాడు. గ్రెగ్ బార్క్లే స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

    ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికైన అయిదో భారతీయుడిగా జై షా నిలిచాడు. అతనికంటే ముందుగా జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్‌ ఉన్నారు.

    ఈ సందర్భంగా జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచడంపై దృష్టి సారిస్తానని తెలిపారు. టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తమన్నారు.

    Details

    మహిళల, దివ్యాంగుల క్రికెట్ ను ప్రోత్సహిస్తా

    ఐసీసీ సభ్యులు బోర్డులు తనపై ఉంచిన విశ్వాసానికి తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం గౌరవంగా ఉందన్నారు.

    మహిళలు, దివ్యాంగుల క్రికెట్‌ను ప్రోత్సహించడంలో ప్రత్యేక చర్యలు చేపడతానని జై షా వెల్లడించారు.

    అయితే, జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన తర్వాత పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    జై షా, బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడే టీమిండియా పాక్‌కు వెళ్లబోదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

    తాజాగా ఐసీసీ ఛైర్మన్‌గా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    క్రికెట్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఐసీసీ

    బీసీసీఐ ఖజానాకు కాసుల పంట.. ఐసీసీ నుంచి ఏడాదికి రూ.2వేల కోట్లు బీసీసీఐ
    బాలీవుడ్ బాద్ షా చేతిలో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ షారుక్ ఖాన్
    టీ20ల్లో ప్రపంచ చరిత్ర రికార్డు సృష్టించిన మలేషియా బౌలర్ క్రికెట్
    ICC Player Of The Month: ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు. ఇంగ్లండ్

    క్రికెట్

    Dattaji Gaekwad: టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత  క్రీడలు
    IND Vs ENG 3rd Test: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. సర్ఫరాజ్-జురెల్ కి అవకాశం..?  క్రీడలు
    Jay Shah: రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తుంది:జేషా క్రీడలు
    Varun Aron: రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025