NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WTC 2023-25: భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌కు ప్రయోజనం.. ఓటమితో తగ్గిన భారత్ పర్సంటేజీ  
    తదుపరి వార్తా కథనం
    WTC 2023-25: భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌కు ప్రయోజనం.. ఓటమితో తగ్గిన భారత్ పర్సంటేజీ  
    భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌కు ప్రయోజనం.. ఓటమితో తగ్గిన భారత్ పర్సంటేజీ

    WTC 2023-25: భారత్‌పై గెలిచిన న్యూజిలాండ్‌కు ప్రయోజనం.. ఓటమితో తగ్గిన భారత్ పర్సంటేజీ  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 20, 2024
    03:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌కు స్వదేశంలో టెస్టు ఓటమి ఎదురైంది. బెంగళూరులో కివీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

    ఈ ఓటమి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ పాయింట్ల పట్టికపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు తెలుసుకుందాం.

    అయితే, భారత్‌ తన స్థానాన్ని కోల్పోలేదు, కానీ పర్సంటేజీలో మాత్రం కొద్దిగా తగ్గుదల కనిపించింది.

    తాజా పట్టిక ప్రకారం, టీమిండియా టాప్‌ స్థానంలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు భారత్‌ 12 టెస్టులు ఆడగా, 8 విజయాలు సాధించిందీ, 3 టెస్టుల్లో ఓడి, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

    ఫలితంగా, భారత్‌కు 98 పాయింట్లు ఉన్నాయి. పర్సంటేజీలో 74.24% నుంచి 68.06%కి పడిపోయింది.

    వివరాలు 

    మొదటి రెండు స్థానాల్లో ఉండాలంటే.. 

    ఆస్ట్రేలియా 62.50%తో రెండో స్థానంలో, శ్రీలంక 55.56%తో మూడో స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్‌ 44.40%తో నాలుగో స్థానానికి చేరుకుంది.

    భారత్‌ మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుకోవాలంటే, ఈ సీజన్‌లో టాప్‌-2లో నిలవాలి.

    ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, ఈ ఓటమి తర్వాత రాబోయే మ్యాచ్‌లు కీలకంగా మారాయి.

    భారత్‌ ఇంకా 7 టెస్టులు ఆడనుంది, ఇందులో కివీస్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఉన్నాయి.

    కనీసం 4 మ్యాచ్‌ల్లో గెలిస్తే టాప్‌-2లో నిలవగలదు. పాయింట్ల కోత లేకుండా చూసుకోవాలి, ముఖ్యంగా స్లో ఓవర్ రేట్ వల్ల పాయింట్లు తగ్గే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    తాజా

    Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ పంజాబ్
    Telangana: పీఎం సూర్యఘర్‌ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్‌ కీలక చర్యలు  తెలంగాణ
    RCB vs PBKS: బెంగళూరు వర్సెస్ పంజాబ్‌.. టైటిల్‌ను ముద్దాడేది ఎవరో? విరాట్ కోహ్లీ
    Chandrababu: సరస్సు పరిరక్షణతో పాటు.. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు  చంద్రబాబు నాయుడు

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే!  క్రికెట్
    టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్ క్రికెట్
    టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    WTC FINAL 2023: హేజిల్‌వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..? క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025