Houthis Attack: బల్క్ క్యారియర్ పై క్షిపణి దాడి.. ఇద్దరు సిబ్బంది మృతి,ఆరుగురికి గాయాలు
యెమెన్ నుండి ప్రయోగించిన క్షిపణి బుధవారం గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో బల్క్ క్యారియర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ఇద్దరు మరణించగా, ఆరుగురు గాయపడినట్లు నివేదించినట్లు అమెరికా అధికారి తెలిపారు. క్షిపణి బార్బడోస్-ఫ్లాగ్డ్, లైబీరియన్ యాజమాన్యంలోని M/V ట్రూ కాన్ఫిడెన్స్కు "భారీ ఎత్తున నష్టం" కలిగించింది. దాడి సమాచారం అందగానే అమెరికా నేతృత్వంలోని యుద్ధనౌకలు కార్గో నౌకకు, సిబ్బందికి రక్షణగా వెళ్లాయి. 'ట్రూ కాన్ఫిడెన్స్' నౌక అమెరికాకు చెందిందని హూతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి పేర్కొన్నారు.
రెండు రోజుల్లో ఐదుసార్లు యాంటి షిప్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి
ఈ ఘటనపై యెమెన్లోని బ్రిటిష్ రాయబార కార్యాలయం స్పందించింది. అమాయకులైన ఇద్దరు నౌకా సిబ్బంది చనిపోయారని, ఇది చాలా బాధకరమైన అంశమని పేర్కొంది. గత రెండు రోజుల్లో హౌతీలు ఐదుసార్లు యాంటి షిప్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. రెండు రోజుల్లో ఇరాన్-మద్దతుగల హుతీలు ప్రయోగించిన ఐదవ యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణి ఇది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్తో అనుసంధానించబడిన ఓడలను తాకుతున్నామని హుతీలు నవంబర్లో ఎర్ర సముద్రం షిప్పింగ్పై దాడి చేయడం ప్రారంభించారు.