NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్
    తదుపరి వార్తా కథనం
    కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్
    కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్

    కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 08, 2023
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆకాంక్షతో లక్షల ఖర్చులకు వెనుకాడకుండా బ్యాంకులో రుణమో, అప్పో సొప్పో చేసి దాదాపుగా 700 మంది భారత విద్యార్థులు కెనడాకు తరలివెళ్లారు.

    ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కిన వారికి అక్కడికి వెళ్లాక తెలిసింది తాము ఏజెంట్ చేతిలో అడ్డంగా మోసపోయామని.

    పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన ఓ ఏజెంట్ సదరు విద్యార్థులకు నకిలీ ఆఫర్ లెటర్లను అందించాడు. దీని కారణంగా కెనడా అధికారులు బాధిత విద్యార్థులను వెనక్కి వెళ్లాలని ఆదేశించారు.

    దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ స్టూడెంట్స్ కి ఏం చేయాలో తోచక, టొరంటోలోని మిస్సిసాగా కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ కాన్ఫరెన్స్ సెంటర్ వద్ద మే 29 నుంచి నిరసన చేస్తూనే ఉన్నారు.

    700 Indian Students Face Deportation From Canadian Authorities

    స్వదేశం బాట పడుతున్న భారత విద్యార్థులు

    భారత విద్యార్థులు కెనడా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ సీన్ ఫ్రాసెర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన మంత్రి, బాధితులకు న్యాయం చేస్తామని మాటిచ్చినట్టు సమాచారం.

    అయితే విద్యార్థులు తీసుకెళ్లిన ఆఫర్ లెటర్లను అక్కడి విద్యాసంస్థలు నకిలీవిగా గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఏ సదరు స్టూడెంట్స్ కి బహిష్కరణ లేఖలను అందజేసింది. ఈ క్రమంలో భారత విద్యార్థులను స్వదేశానికి పంపించేందుకు కెనడా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.

    ఫలితంగా కొందరు విద్యార్థులు ఇప్పటికే భారత్ చేరుకోగా, విద్యార్థులకు నకిలీ ఆఫర్ లెటర్లు అందించి దారుణంగా మోసం చేసిన ఓవర్సీస్ ఎడ్యూకేషన్ కన్సల్టెంట్ బ్రిజేశ్ మిశ్రా పరారీలో ఉన్నట్టు వినికిడి. మరోపక్క నిందితుడి కోసం పంజాబ్ పోలీసులు ముమ్ముర గాలిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కెనడా
    విద్యార్థులు
    భారతదేశం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కెనడా

    కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని పార్లమెంట్‌లో ఖండించిన భారత సంతతి ఎంపీ చంద్ర అంతర్జాతీయం
    కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు నరేంద్ర మోదీ
    Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    విద్యార్థులు

    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యా శాఖ మంత్రి
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ

    భారతదేశం

    భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్  ఎలాన్ మస్క్
    డెంగ్యూ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ టీకా
    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం  అమెరికా
    సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు  ఆస్ట్రేలియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025