Page Loader
Myanmar Earthquake: ప్రార్థనల సమయంలో మయన్మార్'లో భూకంపం.. 700 మంది మృతి
ప్రార్థనల సమయంలో మయన్మార్'లో భూకంపం.. 700 మంది మృతి

Myanmar Earthquake: ప్రార్థనల సమయంలో మయన్మార్'లో భూకంపం.. 700 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతవారం మయన్మార్‌, థాయిలాండ్‌లో సంభవించిన భారీ భూకంపాలు (Earthquake) అపారమైన విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకంపనల ప్రభావంతో మయన్మార్‌లో భారీగా ప్రాణనష్టం సంభవించింది. తాజాగా ఈ భూకంపంతో సంబంధమైన మరిన్ని వివరాలు వెలుగు చూస్తున్నాయి. రంజాన్‌ శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఈ విపత్తు చోటుచేసుకోవడంతో, దేశవ్యాప్తంగా 700 మంది శిథిలాల కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని మయన్మార్‌లోని ముస్లిం ఆర్గనైజేషన్‌ సోమవారం వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 700 మంది మృతి