NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌
    ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌

    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2025
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఆ అశాంతిని భారత్‌పైకి మళ్లిస్తున్న పాకిస్థాన్‌ చర్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధి బృందాలను వివిధ విదేశాలకు పంపిన విషయం తెలిసిందే.

    ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), జపాన్‌కు వెళ్లిన బృందాలు, పాకిస్థాన్ చేస్తున్న దుష్టచర్యలు, అలాగే భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) గురించి అక్కడి నాయకులకు వివరించడంలో నిమగ్నమయ్యాయి.

    ఈ నేపథ్యంలో, ఆ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల ప్రకారం, భారత్‌కు అక్కడి ప్రభుత్వాల నుండి పూర్తి మద్దతు లభిస్తోంది.

    వివరాలు 

    ఉగ్రవాదం ఎలాంటి రూపంలో ఉన్నా దాన్ని తుడిచివేయాలి 

    శివసేన ఎంపీ శ్రీకాంత్ శిండే నేతృత్వంలోని అఖిలపక్ష బృందం యూఏఈ పర్యటనలో భాగంగా, అక్కడి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు, చింతనకర్తలతో పలుసార్లు సమావేశమైంది.

    ఇప్పటికే రెండు ముఖ్య సమావేశాల్లో పాల్గొన్న ఈ బృందం, పాకిస్థాన్‌ కారణంగా ఎదురవుతున్న ఉగ్ర ముప్పు, ఆపరేషన్ సిందూర్‌ వంటి భారత చర్యల వివరాలను వారికి తెలియజేసింది.

    యూఏఈ అధికారులు ఈ సందర్భంగా స్పందిస్తూ, ఉగ్రవాదం ఎలాంటి రూపంలో ఉన్నా దాన్ని తుడిచివేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

    అలాగే, భారత్‌ తీసుకుంటున్న దౌత్యపరమైన చర్యలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

    వివరాలు 

    ఉగ్రవాదంపై పోరాటానికి జపాన్ అండగా నిలుస్తుంది 

    ఇక జెడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలో జపాన్‌ను సందర్శిస్తున్న మరో అఖిలపక్ష బృందం, అక్కడి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది.

    ఈ సందర్భంగా జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్‌ తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం అన్నరు.

    ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారిని తప్పక శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

    భారత్‌ ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటానికి తమ దేశం అండగా నిలుస్తుందని జపాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం
    Aishwarya Rai: కేన్స్‌లో సిందూరంతో ఐశ్వర్య రాయ్.. లుక్‌పై నటి సెలీనా జైట్లీ ఆసక్తికర స్పందన అమితాబ్ బచ్చన్
    Himanta Biswa Sarma: ముందు మీ రెండు చికెన్స్ నెక్‌లు జాగ్రత్త.. బంగ్లాదేశ్‌ను హెచ్చరించిన హిమంత బిశ్వ శర్మ  హిమంత బిస్వా శర్మ

    ఆపరేషన్‌ సిందూర్‌

    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  బిజినెస్
    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  భారతదేశం
    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం  భారతదేశం
    Manoj Sinha: యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. ఎందుకంటే ! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025