
Donald Trump: నోబెల్ శాంతి అవార్డు రాకపోవచ్చు.. డొనాల్డ్ ట్రంట్ అవేదన!
ఈ వార్తాకథనం ఏంటి
తాను ఎన్ని మంచి పనులు చేసినా నోబెల్ శాంతి బహుమతి రాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నైరాశ్యం వ్యక్తం చేశారు. నోబెల్ శాంతి బహుమతి-2026 (Nobel Peace Prize 2026)కి ట్రంప్ పేరును పాక్ ప్రభుత్వం ప్రతిపాదించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన పోస్టులో ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాంగో-రువాండా మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని కుదిర్చినట్టు ట్రంప్ తెలిపారు. దశాబ్దాలుగా రక్తపాతం, పౌరుల మరణాలకు కారణమైన యుద్ధాలకన్నా ఇది గొప్పదని వ్యాఖ్యనించారు.
Details
నోబల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదన
ఇరువర్గాల నేతలు ఒప్పంద పత్రాలపై సంతకానికి వాషింగ్టన్ రానున్నారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భాన్ని ఆఫ్రికా, ప్రపంచం మొత్తం కొరకు గొప్ప రోజుగా అభివర్ణించారు. అయితే తాను ఇలాంటివన్నీ చేసినా నోబెల్ శాంతి బహుమతి రాదని అసహనాన్ని వ్యక్తం చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్యనో, సెర్బియా-కొసావో మధ్యనో యుద్ధాలను ఆపినందుకు కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని పేర్కొన్నారు. ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. పాకిస్థాన్ ప్రభుత్వం దీనిని ప్రకటిస్తూ భారత్పై నోరు పారేసింది. భారత్ 'ఆపరేషన్ సిందూర్' ద్వారా పాకిస్తాన్పై దాడి చేసి ప్రాణనష్టం కలిగించిందని ఆరోపించింది.
Details
ట్రంప్ తో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ భేటీ
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ట్రంప్ వ్యూహాత్మక దూరదృష్టితో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ట్రంప్ నిజమైన శాంతి నిర్మాతని ప్రశంసించింది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ (Asim Munir) ట్రంప్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం నోబెల్ శాంతి ప్రతిపాదనను వైట్హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ధ్రువీకరించారు. నోబెల్ శాంతి బహుమతిని ప్రతిపాదించిన తర్వాతే మునీర్ కు ట్రంప్ విందు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. అణుఘర్షణను నివారించిన ట్రంప్ దీనికి తగిన ఘనత అందుకోవాలని అభిప్రాయపడ్డారు.