NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Airport Ranks: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు టాప్.. వరల్డ్ టాప్-10లో భారతీయ ఎయిర్‌పోర్టు.. దేంట్లో అంటే..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Airport Ranks: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు టాప్.. వరల్డ్ టాప్-10లో భారతీయ ఎయిర్‌పోర్టు.. దేంట్లో అంటే..!
    ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు టాప్

    Airport Ranks: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు టాప్.. వరల్డ్ టాప్-10లో భారతీయ ఎయిర్‌పోర్టు.. దేంట్లో అంటే..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 14, 2025
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలో అత్యధికంగా రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో మరోసారి దుబాయ్ విమానాశ్రయం అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

    అంతర్జాతీయ విమానాశ్రయాల కౌన్సిల్ (ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ - ACI) తాజాగా విడుదల చేసిన 2023 గణాంకాల ప్రకారం, అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది.

    ఈ జాబితాలో భారత్‌కు చెందిన దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా స్థానం లభించింది.

    77.8 మిలియన్ల ప్రయాణికులతో ఈ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానం పొందింది.

    వివరాలు 

    9.5 బిలియన్లకు చేరుకున్న ప్రయాణికుల సంఖ్య

    మరోవైపు, లండన్‌లోని హీత్రో విమానాశ్రయం రెండవ స్థానంలో నిలవగా, దక్షిణ కొరియాలోని సియోల్ ఇంచియాన్, సింగపూర్, ఆమ్‌స్టర్‌డామ్ వంటి ప్రముఖ విమానాశ్రయాలు మొదటి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.

    గల్ఫ్ ప్రాంతానికి మేజర్ హబ్‌గా పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రధానంగా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు కేంద్రంగా ఉన్నదని నివేదిక పేర్కొంది.

    2023లో ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 92.3 మిలియన్లకు చేరగా,ఇది 2022తో పోలిస్తే 6.1 శాతం అధికం.

    2024లో గ్లోబల్ స్థాయిలో విమానయాన రంగం గణనీయంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది.

    మొత్తం ప్రయాణికుల సంఖ్య 9 శాతం పెరిగి సుమారుగా 9.5 బిలియన్లకు చేరుకున్నట్టు వెల్లడైంది.

    ఇది కోవిడ్-19 మహమ్మారి ముందు ఉన్న స్థాయితో పోల్చితే 3.8 శాతం ఎక్కువ.

    వివరాలు 

    మళ్లీ బలంగా పుంజుకుంటున్న విమానయాన రంగం

    ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం మళ్లీ బలంగా పుంజుకుంటున్న సంకేతంగా ఇది భావిస్తున్నారు.

    ఈ విషయాన్ని ACI సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో స్పష్టం చేసింది.

    ప్రస్తుతం 172 దేశాల్లో ఉన్న 2,181 విమానాశ్రయాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమారుగా 9.9 బిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారని సంస్థ అంచనా వేసింది.

    అయితే, ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించినా, వారి వృద్ధి రేటు కొంత మేరకు మందగించిందని పేర్కొన్నారు.

    దీనికి ప్రధానంగా ఆర్థిక పరిస్థితులలో అస్థిరత మరియు కొన్ని ప్రాంతాల్లో ఉన్న రాజకీయ భిన్నాభిప్రాయాలు, ఉద్రిక్తతలే కారణమని ACI వివరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానాశ్రయం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    విమానాశ్రయం

    శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్  హైదరాబాద్
    లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాబ్
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  విజయనగరం
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025