Page Loader
Israel-Hamas:యాహ్యా సిన్వర్‌ మృతి.. ఇజ్రాయెల్‌తో యుద్ధం మరింత తీవ్రతరం.. తీవ్రంగా స్పందించిన హెజ్‌బొల్లా 
యాహ్యా సిన్వర్‌ మృతి.. ఇజ్రాయెల్‌తో యుద్ధం మరింత తీవ్రతరం.. తీవ్రంగా స్పందించిన హెజ్‌బొల్లా

Israel-Hamas:యాహ్యా సిన్వర్‌ మృతి.. ఇజ్రాయెల్‌తో యుద్ధం మరింత తీవ్రతరం.. తీవ్రంగా స్పందించిన హెజ్‌బొల్లా 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 18, 2024
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ఇప్పుడు నిప్పుల కొలిమిలా ఉన్నది. హమాస్‌ అధినేత యాహ్యా సిన్వర్‌ (Yahya Sinwar)ను ఐడీఎఫ్ మట్టుపెట్టడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం తీవ్రతరం అవుతుందని హెజ్‌బొల్లా గ్రూప్ ప్రకటించింది. ఇరాన్‌ నుంచి కూడా ఇదే తరహా స్పందన వచ్చింది. తమ ప్రతిఘటన బలోపేతం అవుతుందని ఐక్యరాజ్య సమితికి ఇరాన్‌ మిషన్ తెలియజేసింది. పాలస్తీనా విముక్తి కోసం, యువత, చిన్నారులు అతడి బాటలో నడుస్తారని తెలిపారు. ఆక్రమణ, శత్రుత్వ ధోరణి కొనసాగినంత కాలం ప్రతిఘటన కొనసాగుతుందని, అమరులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకువెళ్లగలమని పేర్కొన్నారు.

వివరాలు 

సిన్వర్‌ సోదరుడు మహమ్మద్ పై ఇజ్రాయెల్ సైన్యం దృష్టి

ఇదిలాఉంటే, సిన్వర్ మృతితో ఇజ్రాయెల్ సైన్యం (IDF) ఇప్పుడు అతని సోదరుడిపై దృష్టి పెట్టింది. ఐడీఎఫ్, సిన్వర్‌ సోదరుడు మహమ్మద్, ఇతర హమాస్‌ మిలిటరీ కమాండర్ల జాడ కోసం గాలిస్తున్నామని వెల్లడించింది. హమాస్ అధినేత మరణం తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఆయుధాలను వదిలి,తమ బందీలను తిరిగి పంపిస్తే,ఈ యుద్ధం ముగిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, తమ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు వారు బయటకు వచ్చి జీవించేలా అవకాశం కల్పిస్తామన్నారు. లేదంటే,వేటాడి మరీ హతమరుస్తామని హెచ్చరించారు.''బందీల కుటుంబాలకు నేను చెప్పేది ఒక్కటే. యుద్ధంలో ఇది ముఖ్యమైన ఘట్టం. మీ వారు మీ ఇంటికి చేరుకునేవరకు ఈ పోరాటం కొనసాగుతుంది'' అని ఆయన పేర్కొన్నారు.