
Pakistan: మా వైమానిక స్థావరాలపై భారతదేశం దాడి చేసింది.. పాక్ డిప్యూటీ పీఎం షాకింగ్ వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
దాయాది దేశమైన పాకిస్థాన్ చివరికి భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై స్పందించక తప్పలేదు.
ఈ ఆపరేషన్ వల్ల తమకు తలపగిలేలా దెబ్బ తగిలిందని పాకిస్తాన్ నాయకులు ఒక్కొక్కరిగా అంగీకరిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ కూడా అదే భావనను వ్యక్తం చేశారు.
భారత్ చేపట్టిన వైమానిక దాడులు తమకు భారీ నష్టం మిగిల్చాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఇషాక్ దార్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్ పలు కీలక నష్టాలు చవిచూసిందన్నారు.భారత్ ఆకస్మికంగా మెరుపుదాడులు జరిపిందని వెల్లడించారు.
ప్రత్యేకంగా,రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్,షోర్కోట్లోని మరో కీలక ఎయిర్బేస్ లక్ష్యంగా భారత వాయుసేన దాడులకు పాల్పడిందని చెప్పారు.
వివరాలు
భారత్తో యుద్ధం చేయడం అంత సులభం కాదు
ఈ దాడుల కారణంగా ఆ రెండు స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు.
భారత్పై ప్రతిదాడికి పాకిస్తాన్ సన్నద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని, అందువల్ల తాము సమర్థంగా ప్రతిస్పందించలేకపోయామని ఆయన పేర్కొన్నారు.
భారత వైపు నుంచి గమనించిన వేగవంతమైన చర్యలు,సమర్థవంతమైన వ్యూహం తమను ఆశ్చర్యపర్చిందని కూడా తెలిపారు.
భారత్తో యుద్ధం చేయడం అంత సులభం కాదని దార్ అన్నారు. ఇంతలోనే మరో ఆసక్తికరమైన విషయాన్ని ఇషాక్ దార్ వెల్లడించారు.
భారత దాడులు జరిగిన కేవలం 45 నిమిషాల్లోనే సౌదీ అరేబియా యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ తనను వ్యక్తిగతంగా సంప్రదించారని తెలిపారు.
భారత విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్తో మాట్లాడి భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా చూడాలని సలహా ఇచ్చారని చెప్పారు.
వివరాలు
భారత్ చేపట్టిన దాడులపై స్పందించిన షెహబాజ్ షరీఫ్
ఈ పరిణామాల్లో రియాద్ ఎంతో కీలకమైన పాత్ర పోషించిందని స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా కూడా భారత్ను ఆపేందుకు ప్రయత్నించిందని వ్యాఖ్యానించారు.
ఇకపోతే ఇదే విషయంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇటీవలి కాలంలో స్పందించారు.
భారత్ చేపట్టిన దాడులపై ఆయన కూడా అంగీకారం వ్యక్తం చేశారు.
భారత్ బాలిస్టిక్ క్షిపణులతో తీవ్రంగా దాడులు జరిపిందని,ఇది తమ ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పిన విషయమని షరీఫ్ వెల్లడించారు.
వివరాలు
నూర్ ఖాన్ ఎయిర్బేస్పై భారత్ దాడులకు పాల్పడింది
2025 మే 10వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటలకు పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ తనకు ఫోన్ చేసి ఈ విషయాలను వెల్లడించారని షరీఫ్ తెలిపారు.
నూర్ ఖాన్ ఎయిర్బేస్తో పాటు పాక్లోని మరికొన్ని ప్రాంతాల్లో భారత్ దాడులకు పాల్పడిందని మునీర్ చెప్పారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో షరీఫ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆపరేషన్ సిందూర్ పై పాక్ డిప్యూటీ పీఎం షాకింగ్ వ్యాఖ్యలు
Pakistan Deputy PM Ishaq Dar' openly admits 2 things in this interview
— OsintTV 📺 (@OsintTV) June 19, 2025
📍India struck the Nir Khan Air base and Shorkot Air base
📍 Ishaq Dar' says Saudi Prince Faisal called him asking "Am I authorised to talk to Jaishankar also and CONVEY ..and you are READY TO TALK"… pic.twitter.com/45TJqnlWKu