NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Italy: ఇటలీలో ఖైదీల కోసం ఏకాంత గదుల ఏర్పాటు.. భాగస్వాములతో వారు ప్రైవేటుగా కలుసుకునేందుకు అందుబాటులోకి.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Italy: ఇటలీలో ఖైదీల కోసం ఏకాంత గదుల ఏర్పాటు.. భాగస్వాములతో వారు ప్రైవేటుగా కలుసుకునేందుకు అందుబాటులోకి.. 
    ఇటలీలో ఖైదీల కోసం ఏకాంత గదుల ఏర్పాటు

    Italy: ఇటలీలో ఖైదీల కోసం ఏకాంత గదుల ఏర్పాటు.. భాగస్వాములతో వారు ప్రైవేటుగా కలుసుకునేందుకు అందుబాటులోకి.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటలీ ప్రభుత్వం ఖైదీలకు వారి జీవిత భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

    దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ జైలులో 'ఏకాంత గదులు' ఏర్పాటు చేశారు.

    ఖైదీలు తమ భాగస్వాములతో ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని అక్కడి న్యాయస్థానం గత సంవత్సరం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

    ఈ ఏడాది శుక్రవారం నుంచి సెంట్రల్ ఉంబ్రియా ప్రాంతంలోని ఓ జైలులో ఈ ప్రత్యేక గదులను అందుబాటులోకి తెచ్చారు.

    ఖైదీల హక్కుల కోసం పోరాడే కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

    అయితే, ఖైదీలు ఈ గదులను వాడుకునే సమయంలో వారి వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

    వివరాలు 

    ఈ దేశాల జైళ్లలో ఖైదీలకు ప్రైవేట్ గదులు

    ఇటలీలోని కన్స్టిట్యూషనల్ కోర్టు 2024 జనవరిలో ఇచ్చిన తీర్పులో ఖైదీలకు తమ జీవిత భాగస్వాములు లేదా దీర్ఘకాలిక సహజీవన భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది.

    అలాంటి సమయంలో జైలు సిబ్బంది అక్కడ ఉండకూడదని కోర్టు చెప్పింది.

    ఈ తీర్పును అనుసరించి అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఇటువంటి ఏకాంత గదుల సదుపాయం ఇప్పటికే ఐరోపాలోని అనేక దేశాల్లో అమలులో ఉంది.

    ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, స్వీడన్ వంటి దేశాల్లోని కొన్ని జైళ్లలో ఖైదీలకు ప్రైవేట్ గదులు కల్పిస్తున్నారు.

    వివరాలు 

    ఇటలీలో 62,000 మంది ఖైదీలు

    ఇటలీ,యూరప్‌లో అత్యంత కిక్కిరిసిన జైళ్లను కలిగి ఉన్నదేశంగా నిలుస్తోంది.

    అధికారిక గణాంకాల ప్రకారం,ఇటలీలో ప్రస్తుతం సుమారు 62,000 మంది ఖైదీలు వివిధ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

    అయితే,ఈ సంఖ్య జైళ్ల సామర్థ్యాన్ని 21శాతం మించిపోయింది.ఈ నేపథ్యంలో,ఖైదీల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది.

    ఇటీవల ఖైదీల మధ్య ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది.మానసికంగా స్థిరంగా లేక కొన్ని సందర్భాల్లో ఖైదీలు బలవన్మరణానికి పాల్పడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

    ఈసమస్యల పరిష్కారానికి అధికారులు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు.

    ఖైదీలకు కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించారు.

    తాజా చర్యగా,ఇప్పుడు వారి భాగస్వాములతో ఏకాంతంగా గడిపే అవకాశం కూడా కల్పిస్తున్నారు.

    ఇది ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా తీసుకున్న ముందడుగుగా భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇటలీ

    తాజా

    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం
    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్

    ఇటలీ

    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ ఆటో మొబైల్
    ఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు  గ్యాస్
    ఉత్తర ఇటలీని ముంచెత్తిన వరదలు; 9మంది మృతి; ఫార్ములా వన్ రేసు రద్దు తాజా వార్తలు
    33 ఏళ్ల లవర్ కోసం రూ.900 కోట్ల వీలునామా రాసిచ్చిన మాజీ ప్రధాని ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025