
Khamenei: 'ఖమేనీని హత్య చేయడానికి ముందే అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు': ఇజ్రాయెల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో, ఆ దేశ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయాలని తీవ్రంగా ప్రయత్నించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఖట్జ్ వెల్లడించారు. అయితే, అనుకూలమైన పరిస్థితి లేకపోవడంతో ఈ యత్నం విఫలమైందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన స్థానిక మీడియాలో ప్రసారమైన ఓ ఇంటర్వ్యూలో చేశారు. ఖమేనీ కనిపించకుండా పోవడంతో, హత్య పథకాన్ని నిలిపివేశామని స్పష్టం చేశారు. ''ఆయన అందుబాటులోకి వస్తే తప్పకుండా మేము దాడికి దిగేవాళ్లం. ఆయన్ను మేము గాలించటం చాలా తీవ్రంగా కొనసాగించాం,'' అని ఖట్జ్ చెప్పారు. టెహ్రాన్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై ఇజ్రాయెల్ అధికారికంగా తొలిసారి స్పష్టత ఇచ్చింది.
వివరాలు
ఖమేనీ విషయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇప్పటివరకు ఐడీఎఫ్ దళాలు,రహస్యచర్యల సంస్థలు ఎక్కువగా ఇరాన్ అణుశాఖలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం,ఉన్నతస్థాయి నాయకుడిని హత్య చేసేందుకు యత్నించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో, ఖమేనీ కూడా హెజ్బొల్లా అధినేత హసన్ నస్రుల్లా మాదిరిగా కాలగర్భంలో ఉండే స్థిరమైన బంకర్లోనే ఉండాలని తాము సూచిస్తున్నామని ఖట్జ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా జూన్ 17న సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్రూత్లో ఇచ్చిన ఓ పోస్టులో ఖమేనీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఇరాన్ సుప్రీంలీడర్ ఎక్కడ ఉన్నారో మాకు స్పష్టంగా తెలుసు.ఆయనను లక్ష్యంగా చేసుకోవడం సులభమే. కానీ ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారు.కనీసం ఇప్పటివరకు ఆయనను మేము చంపే ఉద్దేశం లేదు,''అని పేర్కొన్నారు.
వివరాలు
అగ్రరాజ్యానికి చెంపదెబ్బ
పాలకులను మారుస్తామన్న అజెండా తమకు ఇప్పుడేమీ లేదని వెల్లడించారు. ఇజ్రాయెల్తో పోరాటం ప్రారంభమైన నాటినుంచి ప్రజలకు కనిపించని ఖమేనీ, నిన్న మొదటిసారి స్పందించారు. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ, ''అగ్రరాజ్యానికి చెంపదెబ్బ వేసినట్టు మేము వారిపై దాడి చేశాం,'' అని అన్నారు. ఇరాన్ ప్రజల కోసం చేసిన ఈ ప్రసంగాన్ని గురువారం రోజున ఆ దేశ అధికార టెలివిజన్ ప్రసారం చేసింది. ఆ వీడియోలో 86 ఏళ్ల ఖమేనీ తీవ్ర అలసటతో కనిపించారు. పదిన్నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ఆయన అమెరికా, ఇజ్రాయెల్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ దేశంపై మళ్లీ దాడి చేస్తే, అమెరికా అత్యంత భారమైన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు.