
Shehbaz Sharif: భారత్తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు.
అయితే ఈ శాంతి చర్చలలో కాశ్మీర్ సమస్యను తప్పకుండా చేర్చాలని షరీఫ్ స్పష్టం చేశారు.
పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కమ్రా వైమానిక స్థావరంలో అక్కడి సైనికాధికారులు, జవాన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో భారత్-పాక్ మధ్య సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఉగ్రదాడులు, సైనిక ప్రతిస్పందనలు వంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాలు
'ఆపరేషన్ సిందూర్' లో భాగంగా 100 మందికిపైగా ఉగ్రవాదులు హతం
"శాంతిని ఆశించే దిశగా మేము భారత్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం,"అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
అయితే,ఈ సంభాషణలు కాశ్మీర్ అంశాన్ని చర్చించకపోతే అర్థహీనమవుతాయని ఆయన తేల్చి చెప్పారు.
మరోవైపు భారత్ ఇప్పటికే చాలా సందర్భాల్లో జమ్ముకశ్మీర్,లడఖ్ ప్రాంతాలు తమ అంతర్భాగమని, వాటిని ఎప్పటికీ విడదీయలేమని స్పష్టం చేసింది.
మే 6,7 తేదీల్లో జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో ప్రతిస్పందించాయి.
ఈ ఆపరేషన్లో భాగంగా భారత్,పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది.
ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం.
వివరాలు
సైనిక స్థావరాలపై ఎదురుదాడులు
దీనికి ప్రతిగా పాకిస్థాన్ మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించగా,భారత బలగాలు దీనికి కఠినంగా ప్రతిస్పందించాయి.
భారత్ కూడా పాకిస్థాన్లోని రఫీకి,మురిద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియాన్ వంటి ప్రాంతాల్లో ఉన్న పలు సైనిక స్థావరాలపై ఎదురుదాడులు చేసింది.
ఈ క్రమంలో పెరిగిన ఉద్రిక్తతలపై మే 10న ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.
తద్వారా తాత్కాలికంగా ఘర్షణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల నడుమే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైనిక స్థావరాల సందర్శనలో భాగంగా గురువారం కమ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించగా, బుధవారం ఆయన సియాల్కోట్లోని పస్రూర్ కంటోన్మెంట్ను కూడా సందర్శించి అక్కడి సైనికులతో మాట్లాడారు.