NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్
    భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్

    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2025
    09:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు.

    అయితే ఈ శాంతి చర్చలలో కాశ్మీర్ సమస్యను తప్పకుండా చేర్చాలని షరీఫ్ స్పష్టం చేశారు.

    పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న కమ్రా వైమానిక స్థావరంలో అక్కడి సైనికాధికారులు, జవాన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఇటీవలి కాలంలో భారత్-పాక్ మధ్య సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఉగ్రదాడులు, సైనిక ప్రతిస్పందనలు వంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

    వివరాలు 

    'ఆపరేషన్ సిందూర్' లో భాగంగా 100 మందికిపైగా ఉగ్రవాదులు హతం 

    "శాంతిని ఆశించే దిశగా మేము భారత్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం,"అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

    అయితే,ఈ సంభాషణలు కాశ్మీర్ అంశాన్ని చర్చించకపోతే అర్థహీనమవుతాయని ఆయన తేల్చి చెప్పారు.

    మరోవైపు భారత్ ఇప్పటికే చాలా సందర్భాల్లో జమ్ముకశ్మీర్,లడఖ్ ప్రాంతాలు తమ అంతర్భాగమని, వాటిని ఎప్పటికీ విడదీయలేమని స్పష్టం చేసింది.

    మే 6,7 తేదీల్లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో ప్రతిస్పందించాయి.

    ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత్,పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది.

    ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం.

    వివరాలు 

    సైనిక స్థావరాలపై ఎదురుదాడులు

    దీనికి ప్రతిగా పాకిస్థాన్ మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించగా,భారత బలగాలు దీనికి కఠినంగా ప్రతిస్పందించాయి.

    భారత్ కూడా పాకిస్థాన్‌లోని రఫీకి,మురిద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియాన్ వంటి ప్రాంతాల్లో ఉన్న పలు సైనిక స్థావరాలపై ఎదురుదాడులు చేసింది.

    ఈ క్రమంలో పెరిగిన ఉద్రిక్తతలపై మే 10న ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.

    తద్వారా తాత్కాలికంగా ఘర్షణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల నడుమే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైనిక స్థావరాల సందర్శనలో భాగంగా గురువారం కమ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించగా, బుధవారం ఆయన సియాల్‌కోట్‌లోని పస్రూర్ కంటోన్మెంట్‌ను కూడా సందర్శించి అక్కడి సైనికులతో మాట్లాడారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్ పాకిస్థాన్
    Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్ హైదరాబాద్
    Nirav Modi: యూకే హైకోర్టులో నీర‌వ్ మోదీకి షాక్‌.. బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌ యునైటెడ్ కింగ్డమ్
    Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి  తెలంగాణ

    పాకిస్థాన్

    Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  భారతదేశం
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  అంతర్జాతీయం
    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం అంతర్జాతీయం
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025