US-France Visit: మార్సెయిల్లో భారత నూతన కాన్సులేట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్లోని మార్సెయిల్లో భారత కొత్త కాన్సులేట్ను ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముందు, మోదీ మేక్రాన్తో కలిసి భారత వీర వీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల త్యాగాలను గుర్తుగా, ఫ్రాన్స్ ప్రభుత్వం మార్సెయిల్లో ప్రత్యేక యుద్ధ స్మారకాన్ని నిర్మించింది, దీనిని కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ (CWGC) నిర్వహిస్తోంది.
ఈ సందర్బంగా, భారతదేశం-ఫ్రాన్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) వెల్లడించింది.
వివరాలు
అమెరికా బయలుదేరనున్న మోదీ
రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం,పౌర అణుశక్తి, అంతరిక్ష పరిశోధన తదితర రంగాల్లో పరస్పర సహకారం గురించి ఇద్దరు దేశాధినేతలు చర్చలు జరిపారు.
అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
ఇక ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా, మోదీ పారిస్లో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ (AI సమ్మిట్)సమావేశంలో సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
వివిధ దేశాధినేతలు, టెక్నాలజీ నిపుణుల సమక్షంలో ప్రసంగించారు. ఈ రోజు ఫ్రాన్స్ పర్యటనను ముగించుకొని, మోదీ అమెరికా బయలుదేరనున్నారు.
ఈ సందర్భంగా,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతారు.
ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత, మోదీతో ఇది తొలి సమావేశం కానుంది.
ద్వైపాక్షిక సంబంధాలు,వ్యాపార విధానాలు,ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్ల వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశముంది.