NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / US-France Visit: మార్సెయిల్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    US-France Visit: మార్సెయిల్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 
    మార్సెయిల్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    US-France Visit: మార్సెయిల్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2025
    04:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు.

    ఈ కార్యక్రమానికి ముందు, మోదీ మేక్రాన్‌తో కలిసి భారత వీర వీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు.

    మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల త్యాగాలను గుర్తుగా, ఫ్రాన్స్ ప్రభుత్వం మార్సెయిల్‌లో ప్రత్యేక యుద్ధ స్మారకాన్ని నిర్మించింది, దీనిని కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ (CWGC) నిర్వహిస్తోంది.

    ఈ సందర్బంగా, భారతదేశం-ఫ్రాన్స్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) వెల్లడించింది.

    వివరాలు 

    అమెరికా బయలుదేరనున్న  మోదీ 

    రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం,పౌర అణుశక్తి, అంతరిక్ష పరిశోధన తదితర రంగాల్లో పరస్పర సహకారం గురించి ఇద్దరు దేశాధినేతలు చర్చలు జరిపారు.

    అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

    ఇక ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా, మోదీ పారిస్‌లో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ (AI సమ్మిట్)సమావేశంలో సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

    వివిధ దేశాధినేతలు, టెక్నాలజీ నిపుణుల సమక్షంలో ప్రసంగించారు. ఈ రోజు ఫ్రాన్స్ పర్యటనను ముగించుకొని, మోదీ అమెరికా బయలుదేరనున్నారు.

    ఈ సందర్భంగా,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారు.

    ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత, మోదీతో ఇది తొలి సమావేశం కానుంది.

    ద్వైపాక్షిక సంబంధాలు,వ్యాపార విధానాలు,ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్‌ల వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. తిరుపతి
    PM Modi: తానూ మనిషినే అని, దేవుణ్ని కాదంటూ.. పాడ్‌కాస్ట్ లో ప్రధాని మోదీ  భారతదేశం
    Z-Morh Tunnel: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జెడ్-మోడ్‌ ప్రారంభం జమ్ముకశ్మీర్
    Z-Morh Tunnel : జెడ్-మోర్ సొరంగం.. కాశ్మీర్-లడఖ్ రవాణాకు కీలక మైలురాయి జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025