NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / USAID:యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    USAID:యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం!
    యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం!

    USAID:యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 01, 2025
    03:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూఎస్‌ ఎయిడ్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ప్రభావం భారత్‌పై కూడా పడినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

    యూఎస్‌ ఎయిడ్‌ నుంచి భారత్‌కు అందుతున్న ఆర్థికసాయం నిలిచిపోవడంతో, దేశంలో ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటుచేసిన మూడు క్లినిక్‌లు మూతపడినట్లు వార్తలు వెలువడ్డాయి.

    దీనివల్ల దాదాపు 5,000 మంది వైద్య సేవలను పొందే అవకాశం కోల్పోయినట్లు సమాచారం. ఈ క్లినిక్‌లు హైదరాబాద్‌, కళ్యాణ్‌, పుణే ప్రాంతాల్లో స్థాపించారు.

    2021లో హైదరాబాద్‌లో మొదటి క్లినిక్‌ను ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

    వీటి ద్వారా ట్రాన్స్‌జెండర్లకు హార్మోన్ థెరపీ, మందులు, మానసిక ఆరోగ్య పరిరక్షణ, హెచ్‌ఐవీ, ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులపై కౌన్సెలింగ్, సాధారణ వైద్య సంరక్షణ, న్యాయ సహాయం వంటి సేవలు అందించేవారని వెల్లడించారు.

    Details

    ఒక్కొక్క క్లినిక్ కోసం రూ.30 లక్షల ఖర్చు

    ఈ సేవల నిర్వహణకు వార్షికంగా ఒక్కొక్క క్లినిక్‌ కోసం సుమారు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని సమాచారం.

    అయితే ప్రస్తుతం యూఎస్‌ ఎయిడ్‌ నిధులు అందకపోవడంతో ఈ సేవలు నిలిచిపోయాయని తెలుస్తోంది.

    భారత్‌లోని ఈ మూడు ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు మూసివేసిన విషయంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌, రిపబ్లికన్‌ సెనేటర్‌ జాన్‌ కెన్నెడీ స్పందించారు.

    అమెరికా ప్రజలు చెల్లిస్తున్న పన్నులు ఎక్కడ వృథా అవుతున్నాయో ఇప్పటికైనా అర్థం అయ్యిందా అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

    యూఎస్‌ ఎయిడ్‌ అనేది దాదాపు 120 దేశాలకు మానవతా దృక్పథంతో ఆర్థికసాయం అందించే సంస్థ. ప్రపంచ దేశాల అభివృద్ధి, భద్రత కోసం ఈ సంస్థ వందల కోట్ల డాలర్లను అందిస్తోంది.

    Details

    యూఎస్ ఎయిడ్ పై ఆధారపడిన దేశాలపై ప్రభావం

    డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ఎలాన్ మస్క్‌ నేతృత్వంలో 'డోజ్' (DOGE) అనే సంస్థను ఏర్పాటు చేశారు.

    యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా అధికంగా వృథా ఖర్చులు జరుగుతున్నాయని, ఇది నేరగాళ్ల సంస్థగా మారిందని మస్క్‌ ఆరోపించడంతో, తొలుత యూఎస్‌ ఎయిడ్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

    ఆ తర్వాత ఈ సంస్థలోని వేల మంది ఉద్యోగులను తొలగించి, పూర్తిగా మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

    దీంతో ఇన్నాళ్లు యూఎస్‌ ఎయిడ్‌పై ఆధారపడిన దేశాలు తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ఇండియా
    డొనాల్డ్ ట్రంప్
    ఎలాన్ మస్క్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    అమెరికా

    Illegal Migration: అక్రమ వలసదారులపై యూకే ఉక్కుపాదం.. ప్రధాని స్టార్మర్ కఠిన నిర్ణయం డొనాల్డ్ ట్రంప్
    America: అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఢీ.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు   అంతర్జాతీయం
    Donald Trump: ట్రంప్ వలస విధానం.. భారతీయుల భవిష్యత్తుకు ముప్పా? డొనాల్డ్ ట్రంప్
    UN Security Council: IS-Kని అణచివేసేందుకు ట్రంప్‌ సర్కారు ప్రాధాన్యం: ఐరాసలో అమెరికా  ఐక్యరాజ్య సమితి

    ఇండియా

    Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి ఉత్తర్‌ప్రదేశ్
    Dr.K.M Cherian: ప్రముఖ భారత హార్ట్ సర్జన్ ఎం.చెరియన్ కన్నుమూత భారతదేశం
    GBS: పూణెలో కొత్త మహమ్మారి.. ఒకరు మృతి.. వందకు పైగా కేసులు నమోదు మహారాష్ట్ర
    Sri Panchami, Vasantha Panchami: శ్రీ పంచమి, వసంత పంచమి ప్రాముఖ్యత ఏమిటి? పండితులు ఏం చెప్పారంటే? లైఫ్-స్టైల్

    డొనాల్డ్ ట్రంప్

    Indian Migrants: సైనిక విమానంలో 104 మంది వలసదారుల తరలింపు.. అమెరికా ఎంత ఖర్చు చేసిందంటే? అమెరికా
    Joe Biden: ప్రతీకారం తీర్చుకున్న ట్రంప్.. బైడెన్‌కు ఆ అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన జో బైడెన్
    Trump: ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై.. 25 శాతం దిగుమతి సుంకం పెంపు అంతర్జాతీయం
    Donald Trump: గాజాను సొంతం చేసుకుంటాం.. పునరుద్ఘాటించిన డొనాల్డ్‌ ట్రంప్‌ అంతర్జాతీయం

    ఎలాన్ మస్క్

    Trump-Musk: ట్రంప్‌ పాలనలో మస్క్‌ జోక్యం.. డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలకు.. కాబోయే అధ్యక్షుడి సమాధానం ఇదే! డొనాల్డ్ ట్రంప్
    Suchir Balaji Death: 'ఇది ఆత్మహత్యలా అనిపించడం లేదు'.. సుచిర్‌ బాలాజీ మరణంపై మస్క్‌ అంతర్జాతీయం
    Olaf Scholz: జర్మన్ ఎన్నికలలో 'సోషల్ మీడియా ఓనర్లకు ఆ అవకాశం ఇవ్వొద్దు'.. మస్క్‌కు ఛాన్స్‌లర్ కౌంటర్ జర్మనీ
    'Kekius Maximus':ఎలాన్ మస్క్ అధికారిక X ఖాతాలో కొత్త పేరు టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025