LOADING...
Train Derailed: పాకిస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు.. ఒకరు మృతి, 20 మందికి పైగా గాయాలు
పాకిస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు.. ఒకరు మృతి, 20 మందికి పైగా గాయాలు

Train Derailed: పాకిస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు.. ఒకరు మృతి, 20 మందికి పైగా గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2025
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో ఆదివారం రైలు ప్రమాదం సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని లోధ్రాన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలుకు చెందిన నలుగురు బోగీలు ఆకస్మికంగా పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైలు పెషావర్‌ నుంచి కరాచీ వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

Details

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు

పట్టాలు తప్పిన బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. లోధ్రాన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లుబ్నా నజీర్ ప్రకారం, తీవ్రమైన గాయాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణం ఇంకా ఖచ్చితంగా తెలియలేదని ఆమె తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. అయితే, ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక రైల్వే సేవలు తిరిగి ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు.