
Shehbaz Sharif-Erdogan: టర్కీ అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధాని తొలి సమావేశం..
ఈ వార్తాకథనం ఏంటి
ఇస్తాంబుల్లోని డోల్మాబాహ్చె వర్కింగ్ ఆఫీస్లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి మహ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య ముఖాముఖీ చర్చలు జరిగాయి.
ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచడం,అలాగే ప్రాంతీయ,అంతర్జాతీయ అంశాలపై చర్చించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
ఈ సమావేశం ఒక క్లోజ్డ్ రూమ్ లో జరిగింది.ఈ కీలక సమావేశంలో టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్,రక్షణ మంత్రి యాసర్ గులెర్ కూడా పాల్గొన్నారు అని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
పహల్గామ్ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం కౌంటర్ చర్యలు చేపట్టిన అనంతరం,పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ టర్కీతో పాటు ఇరాన్,అజర్బైజాన్,తజికిస్తాన్ దేశాలకు పర్యటనపై బయలుదేరారు.
ఈ పర్యటన మే 25 నుండి మే 30, 2025 వరకూ కొనసాగనుంది.
వివరాలు
సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు
ఈ చర్చల సమయంలో రెండు దేశాలు వాణిజ్య పరిమాణాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచాలని నిశ్చయించుకున్నాయి.
ఇంధనం,రవాణా,రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించడానికి ప్రత్యేక ఒప్పందాలు కుదిరాయి.
ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఉమ్మడి ప్రయత్నాలు తీసుకోవాలని నిశ్చయించారు,ఇందులో శిక్షణ, నిఘా సమాచారం (ఇంటెలిజెన్స్), సాంకేతిక రంగాల్లో సహకారం కీలకంగా ఉండనుంది.
ఇస్తాంబుల్-టెహ్రాన్-ఇస్లామాబాద్ రైలు మార్గ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఎర్డోగన్ వివరించారు.
విద్యారంగంలో పరస్పర సహకారం ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధానితో పాటు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ హాజరయ్యారు.
టర్కీ తరఫున విదేశాంగ, రక్షణ శాఖల ఉన్నతాధికారులు అధ్యక్షుడికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
వివరాలు
పాకిస్తాన్కు టర్కీ మద్దతు - భారత్తో ఉద్రిక్తతలు
2025 ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిగా, మే 7న భారత్ చేపట్టిన "ఆపరేషన్ సిందూర్"లో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.
ఈ దాడుల సమయంలో పాకిస్తాన్ టర్కీ నుంచి వచ్చిన డ్రోన్లను ఉపయోగించినట్టు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పాకిస్తాన్కు బహిరంగ మద్దతు ప్రకటించడం భారత-టర్కీ సంబంధాలలో మరింత ఉద్రిక్తతలకు దారితీసింది.