NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమే:  పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌  
    తదుపరి వార్తా కథనం
    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమే:  పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌  
    భారత్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమే: పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు మేం సిద్ధమే:  పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌  

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 27, 2025
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు.

    నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

    అక్కడ ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ను కలుసుకున్నారు.

    అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భారత్‌తో శాంతి చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్‌ సమస్య, ఉగ్రవాదం, వాణిజ్య సంబంధాలు, జల వనరుల విభేదాలు తదితర అంశాలపై భారత్‌తో చర్చించేందుకు తాము పూర్తిగా సిద్ధమని షరీఫ్‌ స్పష్టం చేశారు.

    వివరాలు 

    చర్చల్లో మూడోపక్షం జోక్యం ఉండకూడదు: మోడీ 

    "కశ్మీర్‌, ఉగ్రవాదం,నీటి పంపిణీ సమస్యలు,వ్యాపార సంబంధాల విషయంలో చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.ఇవన్నీ సమస్యలుగా కాకుండా,చర్చల ద్వారా పరిష్కరించవచ్చని మేము నమ్ముతున్నాం" అని వివరించారు.

    అయితే, ఒకవేళ భారత్‌ యుద్ధ దారిని ఎంచుకుంటే, తాము కూడా తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

    ఇక మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించిన తరువాతే చర్చలు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది.

    ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నట్లు, భారత్‌-పాకిస్తాన్‌ చర్చలు జరిగితే అవి ప్రధానంగా ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమే జరగనున్నాయని స్పష్టం చేశారు.

    అంతేకాదు, ఈ రెండు దేశాల మధ్య జరిగే చర్చల్లో ఎటువంటి మూడోపక్షం జోక్యం ఉండదని కూడా భారత్‌ స్పష్టంగా తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ? పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
    #NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి? డీఆర్జీ దళాలు
    Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు విరాట్ కోహ్లీ

    పాకిస్థాన్

    operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ ఆపరేషన్‌ సిందూర్‌
    TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్ ప్రపంచం
    IMF: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ నుంచి భారీ ఊరట.. $1 బిలియన్ నిధులు విడుదల ఐఎంఎఫ్
    Operation Bunyan Al Marsas : పాక్ దాడులకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' పేరు.. దీని అర్థం ఏమిటో తెలుసా?  ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025