NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Bharti Airtel: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bharti Airtel: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌
    ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌

    Bharti Airtel: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 20, 2025
    04:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీ ఎయిర్‌ టెల్‌ తన యూజర్లకు గుడ్ న్యూస్‌ను అందిస్తూ, గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రిప్షన్ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.

    ఈ ప్రత్యేక ఆఫర్ కోసం గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

    ముఖ్యంగా పోస్ట్ పెయిడ్, వైఫై కస్టమర్లకు అదనపు స్టోరేజీ అందించడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశం. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్, వైఫై యూజర్లకు ఆరు నెలల పాటు 100జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా అందిస్తుంది.

    ఈ స్టోరేజ్‌ను ఐదుగురు వ్యక్తులతో పంచుకునే సదుపాయం కూడా ఉంది.

    details

    స్టోరేజ్ సేవ కొనసాగించాలంటే నెలకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది

    ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో లాగిన్ అయిన అర్హులైన వినియోగదారులు ఈ లాభాలను పొందవచ్చు. ఆరు నెలల తర్వాత స్టోరేజ్ సేవ కొనసాగించాలంటే నెలకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.

    ఈ క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

    ఈ సేవలను గూగుల్‌తో కలిసి అందించడంపై ఎయిర్‌టెల్ సీఈఓ సిద్ధార్థ్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు.

    ఇక జియో కూడా తన ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై 50జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందిస్తోంది.

    Details

    ఎక్కువ రీచార్జి చేసిన వారికి క్లౌడ్ స్టోరేజీ అందుబాటులోకి

    రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జి చేసిన వారికి ఈ క్లౌడ్ స్టోరేజీ అందుబాటులో ఉంటుంది.

    తక్కువ మొత్తంతో రీఛార్జి చేసినవారికి మాత్రం 5జీబీ డేటా ఫ్రీ ట్రయల్ రూపంలో లభిస్తుంది.

    జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో రూ.349, రూ.449, రూ.649, రూ.749, రూ.1549 రేంజ్‌లో క్లౌడ్ స్టోరేజీ సేవలు భాగంగా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

    దీంతో భారతీ ఎయిర్‌టెల్, జియో క్లౌడ్ స్టోరేజ్ సదుపాయాలను పెంచుతూ వినియోగదారులకు మరింత విలువైన సేవలను అందిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ టెల్

    తాజా

    Bharti Airtel: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌ ఎయిర్ టెల్
    Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా రాజస్థాన్
    AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం ఆపరేషన్‌ సిందూర్‌

    ఎయిర్ టెల్

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో భారతదేశం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ ఇండియా
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025