NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Bharat Brand: 'భారత్' బ్రాండ్ క్రింద తృణధాన్యాలు, పప్పులను కూడా విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    Bharat Brand: 'భారత్' బ్రాండ్ క్రింద తృణధాన్యాలు, పప్పులను కూడా విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం 
    'భారత్' బ్రాండ్ క్రింద తృణధాన్యాలు, పప్పులను కూడా విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం

    Bharat Brand: 'భారత్' బ్రాండ్ క్రింద తృణధాన్యాలు, పప్పులను కూడా విక్రయించనున్న కేంద్ర ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 24, 2024
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే మరో అడుగు వేసింది. పప్పుల రాయితీని విస్తరించి, 'భారత్' బ్రాండ్ ద్వారా వీటిని అందించడానికి చర్యలు తీసుకుంది.

    ఇందులో తృణధాన్యాలు,మసూర్‌ దాల్‌లను కూడా చేర్చారు.ఈరాయితీల కారణంగా ప్రజలకు ధరల పెరుగుదల నుంచి కొంతమేరకు ఉపశమనం లభించనుంది.

    రిటైల్‌ మార్కెట్‌లో ఈ ఉత్పత్తులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

    వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఈ విషయాన్ని బుధవారం ప్రకటించారు.

    'భారత్‌'బ్రాండ్‌ రెండో దశ ప్రారంభోత్సవం సందర్భంగా చనా కిలో ధరను రూ.58,మసూర్‌ దాల్ కిలో ధరను రూ.89గా నిర్ణయించామని తెలిపారు.

    ఈధరలు బఫర్‌ స్టాక్‌ నుండి సబ్సిడీతో అందించబడతాయని వివరించారు.ప్రభుత్వం సహకార సంఘాలకు 3లక్షల టన్నుల చనా,68 వేల టన్నుల మసూర్‌ దాల్‌ను కేటాయించింది.

    వివరాలు 

    ఈ ఉత్పత్తులు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్‌ స్టోర్లలో అందించేందుకు చర్యలు 

    ఎన్‌సీసీఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనీస్‌ చంద్ర జోసెఫ్‌ మాట్లాడుతూ, ప్రారంభంలో ఢిల్లీ, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాలలో పంపిణీని మొదలుపెడతామని తెలిపారు.

    వచ్చే పదిరోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ఉత్పత్తులను రిటైల్‌ చేయాలని ప్రణాళిక వేసినట్లు వెల్లడించారు.

    చనాకు భారీ డిమాండ్‌ ఉన్నందున సబ్సిడీ ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

    ఈ ఉత్పత్తులను విస్తరించేందుకు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్‌ స్టోర్లతో చర్చలు జరుగుతున్నాయి.

    'భారత్‌' బ్రాండ్‌ తొలి దశను కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించింది. ఆ దశలో బియ్యం, గోధుమ పిండితో పాటు పప్పులను రిటైల్‌ ధరలకు అందుబాటులోకి తెచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కేంద్ర ప్రభుత్వం

    BSF : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌ తొలగింపు ఇండియా
    All Party Meeting: బంగ్లాదేశ్ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం.. హాజరుకానున్న విదేశాంగ మంత్రి  సుబ్రమణ్యం జైశంకర్
    Pankaj Chaudhary: భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను నియంత్రించే ప్రతిపాదన ఏదీ లేదు: పంకజ్ చౌదరి  టెక్నాలజీ
    Waqf Board: వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 2 బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఈ మార్పులు ఉండే అవకాశం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025