NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం 
    తదుపరి వార్తా కథనం
    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం 
    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం

    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం 

    వ్రాసిన వారు Stalin
    Jun 23, 2023
    02:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్- భారత్ మధ్య కీలక ఒప్పందం జరిగింది.

    ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) వద్ద ఉన్న ఆరు వివాదాలను పరిష్కరించుకునేందుకు అమెరికా, భారత్ అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్ తాయ్ ప్రకటించారు.

    2018లో జాతీయ భద్రత దృష్ట్యా అమెరికా కొన్ని ఉక్కు ఉత్పత్తులపై 25శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10శాతం దిగుమతి సుంకాలను విధించింది.

    ప్రతీకారంగా భారతదేశం జూన్ 2019లో చిక్‌పీస్, కాయధాన్యాలు, బాదం, వాల్‌నట్‌లు, యాపిల్స్, బోరిక్ యాసిడ్, డయాగ్నోస్టిక్ రియాజెంట్‌లతో సహా 28అమెరికన్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు విధించింది.

    ఈ సుంకాలకు సంబంధించి డబ్ల్యూటీఓలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఆ వివాదానికి ఇరుదేశాలు తెరదింపాయి.

    వాణిజ్యం

    ఈ ఒప్పందంతో మరింత బలపడనున్న అమెరికా- భారత్ వాణిజ్య బంధం

    భారత్ సుంకాలు తగ్గించడం వల్ల అమెరికా వ్యవసాయ ఉత్పత్తిదారులు, తయారీదారులకు భారత మార్కెట్ అవకాశాలను పునరుద్ధరిస్తాయని, విస్తరిస్తాయని యూఎస్ పేర్కొంది.

    ఈ ఒప్పందం వల్ల తమ దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింతగా పెరుగుతాయని కేథరీన్ తాయ్ చెప్పారు.

    ఆరు వివాదాల్లో నుంచి మూడు ఉండగా, అమెరికా నుంచి మరో మూడు ఉన్నాయి.

    వాణిజ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెండు దేశాలు పరస్పరం అంగీకరించిన నిబంధనలపై వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఆ తర్వాత జెనీవా కేంద్రంగా నడుస్తున్న డబ్ల్యూటీఓకు తెలియజేయాల్సి ఉంటుంది.

    భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ద్వైపాక్షిక వస్తువుల వ్యాపారం 2021-22లో 119.5 బిలియన్ డాలర్లు ఉండగా, 2022-23లో అది 128.8 బిలియన్ డాలర్లకు పెరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    అమెరికా

    భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్  వైట్‌హౌస్
    చిట్టి ఎలాన్ మస్క్ లుక్ అదుర్స్.. నెట్టింట సందడి చేస్తున్న ఏఐ ఫోటో ట్విట్టర్
    అమెరికా కాంగ్రెస్‌లో మోదీ రెండోసారి ప్రసంగం; ఆ ఘనత సాధించిన తొలి భారత ప్రధాని కాంగ్రెస్
    పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్‌ ను లీజుకిచ్చిన దాయాది దేశం  పాకిస్థాన్

    భారతదేశం

    భారత మార్కెట్‌లో పట్టు సాధించేందుకు స్టార్‌బక్స్ కొత్త వ్యూహం  టాటా
    కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్ కెనడా
    ఫలిస్తున్న ఆర్‌బీఐ ఫ్యూహం.. 50 శాతం రూ.2000 నోట్లు వాపస్  ఆర్ బి ఐ
    71వ ప్రపంచ సుందరి పోటీలు భారత్ లోనే.. 3 దశాబ్దాల్లో ఇదే తొలిసారి భారతదేశం

    తాజా వార్తలు

    వడగాలుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం; రేపు రాష్ట్రాల మంత్రులతో మాండవీయ సమావేశం మన్‌సుఖ్ మాండవీయ
    ఐఐటీ బాంబేకి నందన్ నీలేకని రూ.315 కోట్ల విరాళం  బెంగళూరు
    దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ అరవింద్ కేజ్రీవాల్
    ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025