NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,500 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,500 
    లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,500

    Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@23,500 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 04, 2025
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మంగళవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

    క్రమంగా నష్టాలు చవిచూసిన మార్కెట్లు నేడు కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోలు చేయడం ద్వారా లాభాలు సాధించాయి.

    ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోలులు సూచీలకు పట్టు ఇచ్చాయి.

    మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 23,500 పాయింట్లను క్రాస్ చేసి ప్రారంభమైంది.

    ఉదయం 9:35 గంటలకు సెన్సెక్స్ 488 పాయింట్ల లాభంతో 77,675 వద్ద కొనసాగింది, నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 23,509 వద్ద ఉన్నది.

    వివరాలు 

    డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.86.98

    సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్టీపీసీ, బజాజ్‌ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.86.98 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,853.30 డాలర్ల వద్ద కదలాడుతోంది.

    వివరాలు 

    అమెరికా కీలక సూచీలు  1 శాతం పైగా నష్టపోయాయి.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అమెరికా స్టాక్ మార్కెట్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా సూచీలను ప్రభావితం చేశాయి.

    అమెరికా కీలక సూచీలైన ఎస్ అండ్ పీ 500, డోజోన్స్, నాస్‌డాక్ సోమవారం 1 శాతం పైగా నష్టపోయాయి.

    ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు నేడు లాభాలతో ట్రేడవుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ.3,958 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,708 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    స్టాక్ మార్కెట్

    Startups: 2025లో అంకురాల హవా.. 25 స్టార్టప్స్ ఐపీఓ కోసం సిద్ధం ఐపీఓ
    Standard Glass Lining: స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ ఐపీఓకు 23% ప్రీమియంతో లిస్టింగ్‌ హైదరాబాద్
    Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ వ్యాపారం
    Stock Market: మదుపర్ల కొనుగోళ్ల జోరు.. లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు మహీంద్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025