NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Piyush Goyal: రేట్లు తగ్గించాలన్న పీయూష్ గోయల్.. స్పదించిన RBI గవర్నర్ 
    తదుపరి వార్తా కథనం
    Piyush Goyal: రేట్లు తగ్గించాలన్న పీయూష్ గోయల్.. స్పదించిన RBI గవర్నర్ 
    రేట్లు తగ్గించాలన్న పీయూష్ గోయల్.. స్పదించిన RBI గవర్నర్

    Piyush Goyal: రేట్లు తగ్గించాలన్న పీయూష్ గోయల్.. స్పదించిన RBI గవర్నర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2024
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డొనాల్డ్ ట్రంప్‌ పాలనలో భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ అన్నారు.

    ప్రధానమంత్రి మోదీ, ట్రంప్‌ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నదని ఆయన తెలిపారు.

    సీఎన్‌బీసీ టీవీ-18 నిర్వహించిన గ్లోబల్ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో గోయల్‌ మాట్లాడుతూ, గతంలో ఒబామా, ఇప్పుడు బైడెన్‌ ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం ద్వారా రెండు దేశాల సంబంధాలు బలపడ్డాయని, ట్రంప్‌ ప్రభుత్వంతో ఈ బంధం మరింత బలోపేతం కానుందని అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

     మోదీ నిజాయితీతో తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు: గోయల్‌

    ప్రధానమంత్రి మోదీ ప్రపంచవ్యాప్తంగా నాయకులు, వ్యాపారవేత్తల నమ్మకాన్ని చూరగొన్నారని, నిజాయితీతో తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని గోయల్‌ కొనియాడారు.

    గత దశాబ్దంలో మోదీ పాపులర్‌ లీడర్‌గా ఎదిగారని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌ విజయంలో కీలకంగా నిలిచిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి ట్రంప్‌ పలు బాధ్యతలు అప్పగించినందుకు గోయల్ సంతోషం వ్యక్తం చేశారు.

    ప్రభుత్వ పాలనలో మెరుగుదల కోసం వారు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

    వివరాలు 

    రేట్లు తగ్గించండి

    దేశంలో వినియోగాన్ని పెంచడానికి రేట్లు తగ్గించాలని పరిశ్రమలకు పీయూష్‌ గోయల్‌ సూచించారు.

    మార్కెట్‌లో డిమాండ్ పెరగడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

    ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాలలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గడం గమనించవచ్చని చెప్పారు.

    రిజర్వ్ బ్యాంక్ కూడా వృద్ధిని పెంచడానికి కీలక రేట్లను తగ్గించాలని కోరారు. మంత్రిగారి వ్యాఖ్యలు ప్రాధాన్యం పొందాయి.

    అదే విధంగా, ఆర్థిక వృద్ధి పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ముఖ్యమైన రేట్లను తగ్గించాలని కూడా సూచించారు.

    ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, వచ్చే నెలలో జరగనున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వరకు దీనిపై ఏమీ మాట్లాడే ఉద్దేశ్యం లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పీయూష్ గోయెల్‌
    శక్తికాంత దాస్‌

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    పీయూష్ గోయెల్‌

    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  బ్రిక్స్ సమ్మిట్
    పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ రాజ్యసభ
    Tesla : భారత్‎లోకి టెస్లా.. పీయూష్‌ గోయల్‌తో మస్క్‌ భేటీ ఎప్పుడో తెలుసా టెస్లా
    Piyush Goyal: ఎగ్జిట్ పోల్ తర్వాత భారతీయ పెట్టుబడిదారులు లాభాలు పొందారు,రాహుల్‌కి ఏమీ తెలియదు;బీజేపీ ఎదురుదాడి భారతదేశం

    శక్తికాంత దాస్‌

    RBI Monetary Policy: భారతీయ రిజర్వ్ బ్యాంక్ పెద్ద ఉపశమనం.. ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం ఆర్ బి ఐ
    Repo Rate: రెపోరేటు యథాతథం.. 6.5%గానే కొనసాగిస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం ఆర్ బి ఐ
    RBI: కొన్ని గంటల్లో చెక్ క్లియర్ అవుతుంది! ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటన బిజినెస్
    #NewsBytesExplainer: ఇప్పుడు హోమ్ లోన్ టాప్ అప్ చేయడం కష్టం.. RBI నుండి అప్‌డేట్ ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025