NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Mukesh Ambani: ప్రపంచంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్.. ఎక్కండంటే..!  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mukesh Ambani: ప్రపంచంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్.. ఎక్కండంటే..!  
    ప్రపంచంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్.. ఎక్కండంటే..!

    Mukesh Ambani: ప్రపంచంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న రిలయన్స్.. ఎక్కండంటే..!  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 24, 2025
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్ అంబానీ భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించాలని యోచిస్తున్నారు.

    గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ప్రాంతంలో ఈ డేటా సెంటర్‌ను స్థాపించాలని ఆయన భావిస్తున్నారు.

    దీని నిర్మాణం కోసం ఎన్విడియా నుంచి ఆధునిక ఏఐ చిప్‌లను కొనుగోలు చేయడం జరుగుతుందని సమాచారం.

    ఈ డేటా సెంటర్‌ మూడు గిగావాట్ల సామర్థ్యంతో ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి.

    ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌ వంటి టెక్‌ దిగ్గజ సంస్థలు తమ డేటా సెంటర్‌ సామర్థ్యాలను విస్తరించడానికి ఎంతో మొత్తంలో ఖర్చు చేస్తూ, ఏఐ సేవల కోసం డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి.

    వివరాలు 

    ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌

    తాజాగా, ఓపెన్‌ఏఐ, సాఫ్ట్‌ బ్యాంక్‌, ఒరాకిల్‌ వంటి సంస్థలు సంయుక్తంగా ఒక పెద్ద కృత్రిమ మేధ ప్రాజెక్టుకు సిద్దమైనట్లు ప్రకటించారు.

    స్టార్‌గేట్‌ ప్రాజెక్ట్‌ కోసం 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెచ్చించేందుకు సిద్ధమయ్యారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను భారత్‌లో నిర్మించాలనే ముకేశ్ అంబానీ ఆసక్తి ప్రధానమైనది.

    ఈ డేటా సెంటర్‌ నిర్మాణం సాధ్యమైతే, భారత్‌ ఈ విభాగంలో తన సామర్థ్యాలను పెంచుకోవచ్చు.

    ప్రస్తుతం దేశంలో మొత్తం డేటా సెంటర్‌ సామర్థ్యం గిగావాట్‌ కంటే తక్కువగా ఉన్నా, ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా అది మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది.

    ఇది భారత్‌ కోసం ఒక ప్రముఖ మైలురాయిగా మారవచ్చు.

    వివరాలు 

    కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో కీలక కేంద్రంగా జామ్‌నగర్‌

    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,ఎన్విడియా, గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో కృత్రిమ మేధ (ఏఐ) కంప్యూటింగ్‌ మౌలిక వసతులు, ఇన్నోవేషన్‌ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిపాయి.

    ఈ చర్చల ప్రకారం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ఉద్దేశం వారు ప్రకటించారు

    . "భారత్‌లో ప్రతి ఒక్కరికీ ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం" అని అంబానీ చెప్పారు.

    ఇప్పటికే, జామ్‌నగర్‌ ప్రదేశం, చమురు శుద్ధి, పెట్రోకెమికల్‌, కార్యకలాపాలతో ప్రసిద్ధి పొందింది.

    ఇప్పుడు పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో కీలక కేంద్రంగా మారేందుకు సిద్ధమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముకేష్ అంబానీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025