NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800
    లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800

    Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 29, 2025
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

    ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో మార్కెట్‌ ఊపందుకుంది.

    ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు పెరగడం వల్ల సూచీలకు మద్దతు లభించింది.

    ఈ ప్రభావంతో ఉదయం 9:25 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 81,515 స్థాయికి చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 24,801 వద్ద ట్రేడవుతున్నది.

    వివరాలు 

    సెన్సెక్స్‌-30

    సెన్సెక్స్‌-30లో చురుకైన షేర్ల విషయానికి వస్తే, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    అయితే, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా షేర్లు మాత్రం నష్టాలతో కదలాడుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల పరిస్థితి చూస్తే, బ్రెంట్ క్రూడ్‌ ఒక్కో బ్యారెల్‌ ధర 65.64 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    ఇక బంగారం ధర విషయంలో, ఔన్సు ధర 3,274 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    వివరాలు 

    నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

    మరోవైపు, అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ సూచీ 0.51 శాతం పడిపోయింది.

    ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.56 శాతం తగ్గగా, డోజోన్స్‌ ఇండెక్స్‌ 0.58 శాతం కోల్పోయింది.

    ఆసియా-పసిఫిక్‌ దేశాల స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో కదలాడుతున్నాయి.

    జపాన్‌ నిక్కీ సూచీ 1.68 శాతం పెరగగా, ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.34 శాతం లాభపడింది. అలాగే హాంగ్‌సెంగ్‌ 0.54 శాతం, షాంఘై సూచీ 0.71 శాతం పెరిగాయి. విదేశీ సంస్థాగత మదుపుదారులు (FIIs) బుధవారం నాడు నికరంగా రూ.4,663 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపుదారులు (DIIs) కూడా నికరంగా రూ.7,912 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800 స్టాక్ మార్కెట్
    Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌.. తెలంగాణ
    Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు!  కోవిడ్
    USA: 'చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం'.. మార్కో రూబియో సంచలన ప్రకటన మార్కో రూబియో

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. బిజినెస్
    Stock Market: నేడు ఫ్లాట్‌గా రోజును ప్రారంభించిన దేశీయ మార్కెట్ సూచీలు  బిజినెస్
    Stock Market: నష్టాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్.. 155 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్  బిజినెస్
    Market Crash: యుద్ధ ఆందోళనలతో చతికిలపడ్డ మార్కెట్లు.. ఇన్వెస్టర్లు వెనక్కి! బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025