Page Loader
కేరళ విషాదం.. రూ. కోటీ విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్
కేరళ విషాదం.. రూ. కోటీ విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్

కేరళ విషాదం.. రూ. కోటీ విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2024
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకరికి సాయం చేయడంలో ఎల్లప్పుడూ మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. తాజాగా కేరళలోని వయనాడ్ బాధితులను అదుకొని మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచి వేసింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి పలువురు సినీ తారాలు ముందుకొస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తనవంతు సాయంగా కోటీ రూపాయలు ఇచ్చారు. ఈ మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందించారు. అయితే రామ్ చరణ్‌తో కలిసి ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.

Details

అల్లు అర్జున్ రూ. 25 లక్షలు విరాళం

ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందని చిరంజీవి అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధలో ఉన్న వారందరూ త్వరగా కోలుకోవాలన్నారు. మరోవైపు మెగా హీరో అల్లు అర్జున్ కూడా రూ. 25 లక్షల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కేరళ వాసులు తనను ఎంతో అభిమానించారని, వయనాడ్ ఘటన తనని కలిచి వేసిందన్నారు.