Page Loader
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌‌లో వెలుగు చూసిన కీలక పరిణామాలు
సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌‌లో వెలుగు చూసిన కీలక పరిణామాలు

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌‌లో వెలుగు చూసిన కీలక పరిణామాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2025
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన ఘటనలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు సమర్పించిన ఛార్జిషీట్‌లో ఉన్న వివరాలు సంచలనంగా మారాయి. సైఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రలు, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న షరీఫుల్ ఇస్లాం షెహాజాద్‌కు చెందినవిగా కాకపోవడం గమనార్హం. పోలీసుల పరిశీలనలో ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన 1,600 పేజీల ఛార్జిషీట్‌లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.

వివరాలు 

దాడిలో సైఫ్ కి గాయాలు 

2025 జనవరి 16 వ తేదీ తెల్లవారుఝామున ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటనతో సినిమా ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. సుమారు రాత్రి 2 గంటల సమయంలో ఓ అనుమానాస్పద వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి, కత్తితో అతనిపై పలు మార్లు దాడికి పాల్పడ్డాడు. ముందుగా ఆయన ఇంటిలో పని చేస్తున్న మహిళా సిబ్బందిపై దాడి చేయగా, అశబ్దాలు వినిపించడంతో సైఫ్ స్పందించి ఆ వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోగా, దాడిలో సైఫ్ గాయాలపాలయ్యారు. వెంటనే సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు.

వివరాలు 

 20 వేలిముద్రల నమూనాల సేకరణ 

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన ప్రారంభించారు. సైఫ్ ఇంటి ఆవరణంలో వేలిముద్రల కోసం గాలింపు చేపట్టిన అధికారులు, సీసీ టీవీ ఫుటేజ్‌ను కూడా పూర్తిగా అధ్యయనం చేశారు. ఫ్లాట్‌లోని వివిధ ప్రదేశాల్లో మొత్తం 20 వేలిముద్రల నమూనాలను సేకరించినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా బంగ్లాదేశ్‌కు చెందిన షెహాజాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ,ఫోరెన్సిక్ పరీక్షల్లో అతని వేలిముద్రలు సంఘటనా స్థలంలో లభించిన వాటితో సరిపోలవని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టమైన స్పష్టం కూడా ఉంది.అయితే,షెహాజాద్ నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి మాత్రం దాడికి ఉపయోగించిందనే అనుమానాలను బలపరిచింది. ఈ విషయాన్ని పోలీసులు ముంబై కోర్టులో తెలియజేశారు.