Page Loader
Samantha: ఎక్స్‌లోకి సమంత రీఎంట్రీ.. మొదటి పోస్ట్‌ ఏంటంటే? 
ఎక్స్‌లోకి సమంత రీఎంట్రీ.. మొదటి పోస్ట్‌ ఏంటంటే?

Samantha: ఎక్స్‌లోకి సమంత రీఎంట్రీ.. మొదటి పోస్ట్‌ ఏంటంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడు ఉండే సినీతారల్లో సమంత ఒకరు. 2012లో ఆమె ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) ఖాతాను ప్రారంభించారు. అయితే ఇటీవల ఆమె తన ఎక్స్‌ ఖాతాలో ఉన్న పాత పోస్ట్‌లన్నింటినీ తొలగించారు. అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వేదికల్లో ఆమె మరింత యాక్టివ్‌గా మారారు. ఇక తాజాగా సమంత ఎక్స్‌ వేదికపైకి తిరిగి వచ్చారు. సోమవారం ఆమె మొదటి పోస్ట్‌ను షేర్‌ చేశారు. తెరపై విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత, 2023లో నిర్మాతగా మారారు. 'ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌' పేరుతో తన నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇప్పుడు ఈ బ్యానర్‌లో తొలి సినిమా 'శుభం' విడుదలకు సిద్ధమవుతోంది.

వివరాలు 

మా క్వీన్‌ తిరిగి వచ్చింది

ఈ విషయాన్ని ఎక్స్‌ ద్వారా ప్రకటిస్తూ, "పెద్ద ఆశయాలతో... మా చిన్న ప్రేమను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇది నాకు ప్రత్యేకమైనది. మంచి ఆరంభం అవుతుంది" అంటూ పోస్ట్‌ చేశారు. సమంత మళ్లీ ఎక్స్‌లో అడుగుపెట్టిన విషయంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. "స్వాగతం తిరిగి వచ్చిన సమంతకు", "మా క్వీన్‌ తిరిగి వచ్చింది" అంటూ అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎక్స్‌లో సమంతకు 10.2 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

వివరాలు 

కొత్త ప్రాజెక్ట్‌ 'మా ఇంటి బంగారం' 

ఇక సినిమాల విషయానికి వస్తే, సమంత సుమారు ఏడాదిన్నరుగా బిగ్‌స్క్రీన్‌పై కనిపించలేదు. చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' చిత్రంలో నటించారు. అనంతరం ఆమె భాగస్వామిగా ఉన్న 'సిటడెల్‌ : హనీ బన్నీ' వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. గత సంవత్సరం తన జన్మదిన సందర్భంగా 'మా ఇంటి బంగారం' అనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అయితే పోస్టర్‌ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్‌పై ఎలాంటి కొత్త సమాచారం విడుదల కాలేదు.