Kerala: వాయనాడ్లో ప్రకృతి బీభత్సం... ఇప్పటివరకు 143 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం కేరళలోని వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన ఘోర ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 143 మంది మరణించగా, 128 మంది గాయపడ్డారు.
శిథిలాల కింద వందలాది మంది చిక్కుకునే అవకాశం ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వాయనాడ్లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు తప్పించుకునే అవకాశం కూడా లభించలేదు.
వివరాలు
డ్రోన్లు,డాగ్ స్క్వాడ్ల సహాయంతో సహాయం
ఆర్మీ,నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF)నుండి పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీమ్లు ప్రతికూల వాతావరణం మధ్య బాధితుల కోసం వెతుకుతున్నాయి.
బాధితులకు అవసరమైన సహాయం అందించడానికి బహుళ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి.
జిల్లాలో ఏర్పాటు చేసిన 45 సహాయ శిబిరాలకు 3వేల మందికి పైగా ప్రజలను తరలించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
రాత్రి 2 గంటలకు మొదటగా కొండచరియలు విరిగిపడ్డాయని,ఆ తర్వాత తెల్లవారుజామున 4:10 గంటలకు రెండోసారి కొండచరియలు విరిగిపడ్డాయని విజయన్ తెలిపారు.
డ్రోన్లు,డాగ్ స్క్వాడ్ల సహాయంతో ప్రజలను కనుగొని సహాయం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మృతదేహాలను బయటకు తీయడంలో రెస్క్యూ టీం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వివరాలు
రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను పరిశీలించిన రాజ్నాథ్ సింగ్
సాధ్యమయ్యే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ఒక పోస్ట్లో తెలిపింది.
త్రివేండ్రం, బెంగళూరు, ఢిల్లీ నుండి సర్వీస్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా అదనపు దళాలు, యంత్రాలు, డాగ్ స్క్వాడ్లు, ఇతర అవసరమైన సహాయక సామగ్రిని రప్పిస్తున్నారు.
అంతకుముందు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడి, కొండచరియలు విరిగిపడిన వాయనాడ్లో సైన్యం చేపడుతున్న రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను పరిశీలించారు.