NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..?

    Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 02, 2025
    01:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది (2025) బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది.

    ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ యోచనలో ఉన్నట్లు సమాచారం.

    అక్టోబర్ 20న దీపావళి,అక్టోబర్ 28న ఛత్ పూజ వంటి ప్రముఖ పండుగలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

    ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘానికి చెందిన వర్గాలను ఉదహరిస్తూ జాతీయ మీడియా నివేదికలు వెలువడ్డాయి.

    ఇక బీహార్‌ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది. తదనుగుణంగా, ఆ తేదీకి ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.

    వివరాలు 

    బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో..

    ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ నెలలో బీహార్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.

    త్వరలోనే ఎన్నికల తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

    గత 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించారు.

    అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఓటింగ్‌ జరిగింది. నవంబర్ 10న ఫలితాలను ప్రకటించారు.

    ఆ ఎన్నికల్లో బీజేపీ,జేడీయూ కలిసి పోటీ చేసిన ఎన్డీయే కూటమికి గణనీయమైన విజయవకాశాలు లభించాయి.

    అనంతరం వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

    వివరాలు 

    రెండు సంవత్సరాల వ్యవధిలోనే కూలిన ప్రభుత్వం 

    అయితే, రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది.

    బీజేపీ చేతిలో అధిక ఆధిపత్యం ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు.

    దీంతో నితీష్ కుమార్‌ 2022లో ఆ కూటమిని వదిలి ఆర్జేడీతో చేతులు కలిపారు.

    తద్వారా సీఎం పదవిని కొనసాగించారు. ఆ తర్వాత 2024 జనవరిలో నితీశ్ మళ్లీ బీజేపీతో కలవడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..? బిహార్
    Piyush Goyal: వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్‌ పీయూష్ గోయెల్‌
    IPL 2025: ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరిది..? ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    coriander recipes: కొత్తిమీర వేసి చేసే మూడు అద్భుతమైన వంటకాలు ఇవే.. ట్రై చేయండి వంటగది

    బిహార్

    Bihar Bridge Collapse : బీహార్‌లో కూలిన మరో వంతెన.. మూడు వారాల్లో 13వ ప్రమాదం   భారతదేశం
    Bihar: బీహార్‌ వీఐపీ పార్టీ చీఫ్ తండ్రి దారుణ హత్య  హత్య
    Paris Olympics: ఒలింపిక్స్ బరిలో బిహార్ మహిళ ఎమ్మెల్యే.. స్వర్ణ పతాకమే లక్ష్యంగా బరిలోకి! పారిస్ ఒలింపిక్స్
    Bihar: బీహార్ రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025