NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jyoti Malhotra: 'పాక్‌లో ఏకే 47లతో భద్రత!' .. యూట్యూబర్‌ జ్యోతి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jyoti Malhotra: 'పాక్‌లో ఏకే 47లతో భద్రత!' .. యూట్యూబర్‌ జ్యోతి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌..

    Jyoti Malhotra: 'పాక్‌లో ఏకే 47లతో భద్రత!' .. యూట్యూబర్‌ జ్యోతి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై దర్యాప్తు కొనసాగుతోంది.

    ఈ నేపథ్యంలో ఓ స్కాట్లాండ్‌కు చెందిన యూట్యూబర్ క్యాలమ్ మిల్ తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

    ఈ వీడియోలో జ్యోతి మల్హోత్రా పాక్‌ పర్యటనలో భాగంగా కనిపించగా, అక్కడ ఆమెకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

    పాకిస్థాన్‌ పర్యటనలో భాగంగా క్యాలమ్ మిల్ తీసిన అనేక వీడియోలను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

    వాటిలో ఒకదాంట్లో లాహోర్ నగరంలోని అనార్కలి బజార్ ప్రాంతంలో జ్యోతి మల్హోత్రా వీడియోలు తీస్తుండగా ఆమెతో క్యాలమ్ మిల్ ఎదురయ్యాడు.

    వివరాలు 

    ఏకే-47 తుపాకులతో ఆమెకు భద్రత

    ఆ సమయంలో క్యాలమ్ మిల్ ఆమెతో పలకరించి మాట్లాడుతుండగా, తాను స్కాట్లాండ్‌కు చెందిన యూట్యూబర్‌ని అని చెప్పాడు.

    ఈ నేపథ్యంలో జ్యోతి సమాధానంగా తాను భారత్‌ నుండి వచ్చినట్టు తెలిపింది. అనంతరం జ్యోతి అతడిని'మీరిప్పుడు మొదటిసారిగా పాకిస్థాన్‌ వచ్చారా?'అని ప్రశ్నించగా,క్యాలమ్ ఇప్పటివరకు ఐదు సార్లు పాక్‌కి వచ్చానని చెప్పాడు. పాకిస్థాన్‌ ఆతిథ్యంపై ఆమె అభిప్రాయాన్ని అడిగినప్పుడు, "చాలా బాగుంది" అని జ్యోతి సమాధానమిచ్చింది.

    తర్వాత ఆమె అక్కడినుండి వెళ్లిపోయే సమయంలో,ఆమె చుట్టూ సాధారణ దుస్తుల్లో ఉన్న ఆరుగురు వ్యక్తులు ఏకే-47 తుపాకులతో ఆమెకు భద్రత కల్పిస్తున్నట్లు క్యాలమ్ గమనించాడు.

    దీనిని చూసిన అతడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.వారందరూ వేసుకున్న జాకెట్లపై "నో ఫియర్" అనే పదాలు ముద్రించి ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది.

    వివరాలు 

    పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో జ్యోతి మల్హోత్రా  సంబంధాలు

    ఒక సాధారణ పర్యాటకురాలికి ఇంత స్థాయిలో సాయుధ భద్రత అవసరమా? అంటూ క్యాలమ్ తన వీక్షకులను ప్రశ్నించాడు.

    ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.

    అయితే వీడియోలో ఆమె చుట్టూ మరికొందరు పర్యాటకులు కూడా ఉండటంతో ఆ భద్రత కేవలం జ్యోతి కోసమా? లేదా ఆమె బృందం మొత్తం కోసమా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

    ఇక గూఢచర్యం కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో జ్యోతి మల్హోత్రా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నట్టు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

    పాకిస్థాన్ హైకమిషన్‌లో పని చేసే డానిష్ అనే వ్యక్తితో తాను తరచూ టచ్‌లో ఉండేదాన్నీ, అతడిని మొదటిసారి 2023లో వీసా కోసం హైకమిషన్‌కు వెళ్లినప్పుడు కలిసినట్టు తెలిపింది.

    వివరాలు 

     జ్యోతి పాక్‌కు కీలక సమాచారం 

    పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా జ్యోతి పాక్‌కు కీలక సమాచారం అందించినట్లు అనుమానాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

    పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వెళ్లే భారతీయులను లక్ష్యంగా చేసుకుని, వారిని గూఢచర్యానికి ఉపయోగించుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. అలాంటి తరహాలోనే డానిష్ కూడా జ్యోతిని టార్గెట్ చేశాడని పోలీసులు వెల్లడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ అవుతున్న వీడియో ఇదే..

    More than 6 guards with automatic rifles provided security to Jyoti Malhotra in Pakistan.

    What kind of info was she providing to Pakistan that she was given so much security?

    Scottish You Tuber Callum Mill shot this video & even he found it very strange & weird. pic.twitter.com/z6hASfOXB6

    — Incognito (@Incognito_qfs) May 26, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జ్యోతి మల్హోత్రా

    తాజా

    Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,800 స్టాక్ మార్కెట్
    Telangana: తొలిసారిగా డీఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ సాంకేతికత.. లాకోన్స్‌ డీఎన్‌ఏ పరీక్షకు పేటెంట్‌.. తెలంగాణ
    Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు!  కోవిడ్
    USA: 'చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం'.. మార్కో రూబియో సంచలన ప్రకటన మార్కో రూబియో

    జ్యోతి మల్హోత్రా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   భారతదేశం
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ భారతదేశం
    Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..  భారతదేశం
    Jyoti Malhotra Case: యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025