NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Central Tax: కేంద్ర పన్నుల్లో 60% వాటా ఏడు రాష్ట్రాలకే.. 9,15 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 
    తదుపరి వార్తా కథనం
    Central Tax: కేంద్ర పన్నుల్లో 60% వాటా ఏడు రాష్ట్రాలకే.. 9,15 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 
    కేంద్ర పన్నుల్లో 60% వాటా ఏడు రాష్ట్రాలకే.. 9,15 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

    Central Tax: కేంద్ర పన్నుల్లో 60% వాటా ఏడు రాష్ట్రాలకే.. 9,15 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర పన్నుల్లో 60% వాటా కేవలం ఏడు రాష్ట్రాలకు మాత్రమే వెళ్తోంది.

    ఇందులో ఉత్తర్‌ప్రదేశ్‌ (18%), బిహార్‌ (10%) పెద్ద మొత్తంలో లబ్ధిపొందుతున్నాయి. మొత్తం వాటాలో తొలిమూడు స్థానాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌లకు కలిపి దాదాపు 36% చేరుతోంది.

    తొలి ఏడు రాష్ట్రాలలో ఉన్న పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశాలను కూడా కలిపితే మొత్తం రూ.7,75,242.02 కోట్లు కేటాయించబడినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సంజయ్ చౌధరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు.

    2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీ వరకు దేశంలోని 28 రాష్ట్రాలకు కేంద్రం మొత్తం రూ.12,86,885.44 కోట్లు పంపిణీ చేయగా, అందులో ఏడు రాష్ట్రాలకు 60% కేటాయించబడగా,మిగిలిన 21 రాష్ట్రాలకు కలిపి 40% మాత్రమే దక్కినట్లు వెల్లడైంది.

    వివరాలు 

    కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు

    దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు కలిపి రూ.2,03,327.38 కోట్లు (15.79%) మాత్రమే లభించాయి.

    ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే వచ్చిన మొత్తం కంటే ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలకు 11.92% (రూ.27,527.24 కోట్లు) తక్కువగా కేటాయించబడింది.

    తమ రాష్ట్రాల్లో పన్ను వసూళ్లు అధికంగా ఉన్నప్పటికీ, కేంద్ర పన్నుల్లో వాటా ఎక్కువగా ఉత్తరాదికే వెళ్తోందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పన్ను

    తాజా

    Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత! విజయవాడ వెస్ట్
    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్

    పన్ను

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు ప్రకటన
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025