NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?

    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?

    వ్రాసిన వారు Stalin
    May 27, 2023
    11:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 8మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు గైర్జాజరయ్యారు.

    కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి హాజరు కాని ముఖ్యమంత్రులు ఎవరు? ఎందుకు గైర్హాజరయ్యారో తెలుసుకుందాం.

    అరవింద్ కేజ్రీవాల్: సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా దిల్లీలో కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవడం లేదని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ రాశారు.

    మమతా బెనర్జీ: నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరు కాకూడదని పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందే నిర్ణయించుకున్నారు. ఆర్థిక మంత్రి, ప్రధాన కార్యదర్శిని పంపాలని టిఎంసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.

    దిల్లీ

    హైదరాబాద్‌లో కేసీఆర్- కేజ్రీవాల్ సమావేశం

    నితీష్ కుమార్: ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాల వల్ల నితీష్ కుమార్ హాజరు కాలేకపోయారని బిహార్ మంత్రులు చెప్పారు.

    ఎం.కె స్టాలిన్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతం సింగపూర్, జపాన్ పర్యటనలో ఉన్నారు. అందుకే ఆయన హాజరుకాలేదు.

    కేసీఆర్: కేజ్రీవాల్‌తో శనివారం హైదరాబాద్‌లో సమావేశం కావాల్సి ఉన్నందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశానికి హాజరుకావడం లేదు.

    భగవంత్ మాన్: రాష్ట్రానికి నిధుల మంజూరు విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షకు నిరసనగా పంజాబ్ ముఖ్యమంత్రి సమావేశానికి హాజరుకావడం లేదు.

    అశోక్ గెహ్లాట్: అనారోగ్య కారణాలతో సిఎం గెహ్లాట్ సమావేశానికి హాజరు కావడం లేదని రాజస్థాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    పినరయి విజయన్: కేరళ సీఎం విజయన్ గైర్హాజరు కావడానికి ఎటువంటి నిర్దిష్ట కారణాలను తెలపలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    ముఖ్యమంత్రి

    తాజా

    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్
    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    దిల్లీ

    దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్ మెక్సికో
    దిల్లీ మెట్రోలో బ్రాలెట్, మినీ స్కర్ట్‌లో మహిళ హల్‌చల్; అశ్లీల ప్రదర్శనపై చట్టం ఏం చెబుతోంది? భారతదేశం
    'దేశానికి విద్యావంతులైన ప్రధాని కావాలి'; మోదీని ఉద్దేశించి సిసోడియా లేఖ మనీష్ సిసోడియా
    ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ

    నరేంద్ర మోదీ

    అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ  ఉక్రెయిన్
    'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ  ప్రధాన మంత్రి
    పాఠశాలను బాగు చేయాలని మోదీని కోరిన విద్యార్థిని; స్పందించిన యంత్రాంగం జమ్ముకశ్మీర్
    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  సూడాన్

    ప్రధాన మంత్రి

    రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ  రాజస్థాన్
    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి  కేరళ
    గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు  పాకిస్థాన్

    ముఖ్యమంత్రి

    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్
    మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025