NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sanjay Raut: ఓటమికి ఆప్, కాంగ్రెస్ సమాన బాధ్యత వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Sanjay Raut: ఓటమికి ఆప్, కాంగ్రెస్ సమాన బాధ్యత వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
    ఓటమికి ఆప్, కాంగ్రెస్ సమాన బాధ్యత వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

    Sanjay Raut: ఓటమికి ఆప్, కాంగ్రెస్ సమాన బాధ్యత వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 10, 2025
    12:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది.

    ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. మూడోసారి వరుసగా కాంగ్రెస్‌కు జీరో సీట్లు రావడం గమనార్హం. తాజాగా ఈ ఎన్నికల ఫలితాలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.

    దిల్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి ఆప్, కాంగ్రెస్ రెండు పార్టీలు సమానంగా బాధ్యత వహించాలని సూచించారు.

    "మనమంతా ఇండియా కూటమిలో భాగస్వాములం. అందులో కాంగ్రెస్ సీనియర్ భాగస్వామి. అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పైనా, ఆప్‌పైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

    Details

    ఇండియా కూటమిలో ఎవరికీ అహంకారం ఉండకూడదు

    ఇక ఎన్నికలకు ముందు చర్చ జరిపి, ఆప్-కాంగ్రెస్ కలసి పోటీ చేసి ఉంటే బీజేపీ గెలిచే అవకాశం ఉండేది కాదని స్పష్టం చేశారు.

    ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ సమానంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

    ఇండియా కూటమిలో ఎవరికీ అహంకారం ఉండకూడదని, ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్రను పోషించాలని ఆయన హితవు పలికారు.

    ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి కీలక నాయకులు ఓటమిపాలయ్యారు. అయితే అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచారు.

    మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా కూటమి
    కాంగ్రెస్
    దిల్లీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఇండియా కూటమి

    అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు  లోక్‌సభ
    ఇవాళ ఇండియా కూటమి మూడో  కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో ముంబై
    ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం ముంబై
    "సాధ్యమైనంత వరకు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాం": ఇండియా బ్లాక్ రిజల్యూషన్ భారతదేశం

    కాంగ్రెస్

    INDIA Bloc: మమతా బెనర్జీకి పరోక్ష మద్దతు.. విపక్ష పార్టీల్లో కొత్త చర్చలకు ముడిపెడుతున్న లాలూ! ఇండియా కూటమి
    Rahul Gandi: రాజ్యాంగం అనేకమంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు రాహుల్ గాంధీ
    Jairam Ramesh : ఎన్డీఏ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నెహ్రూ పేరు ప్రస్తావన జైరామ్ రమేష్
    ManiShankar Iyer: గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు! ఇండియా

    దిల్లీ

    Arvind Kejriwal: నితిన్ గడ్కరీ పనితీరుపై ప్రశంసలు కురిపించిన అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్
    Delhi Elections 2025: నేడే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. దిల్లీలో పెరిగిన రాజకీయ వేడి ఎన్నికలు
    Delhi Elections: ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ ఎన్నికల సంఘం
    Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025