NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sanjay Singh arrest: నరేంద్ర మోదీకి భయం పట్టుకుంది : కేజ్రీవాల్
    తదుపరి వార్తా కథనం
    Sanjay Singh arrest: నరేంద్ర మోదీకి భయం పట్టుకుంది : కేజ్రీవాల్
    నరేంద్ర మోదీకి భయం పుట్టుకుంది : కేజ్రీవాల్

    Sanjay Singh arrest: నరేంద్ర మోదీకి భయం పట్టుకుంది : కేజ్రీవాల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 05, 2023
    10:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది.

    మనీల్యాండరింగ్ ఆరోపణలపై బుధవారం ఉదయం దిల్లీలోని ఎంపీ నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు.

    దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం పీఎంఎల్ఏ కింద అరెస్టు చేసినట్లు అధికారులు ధృవీకరించారు .

    సంజయ్ సింగ్ అరెస్టుపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో నేడు న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన తెలుపనున్నారు.

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ కుటుంబాన్ని కలిసిన తర్వాత విలేకర్లతో మాట్లాడారు.

    Details

    భారతదేశంలో అత్యంత అవినీతిపరుడు మోదీనే : క్రేజీవాల్

    ప్రధాని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని, ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు.

    ఆప్ "హార్డ్ కోర్ నిజాయితీ గల పార్టీ" అని పేర్కొన్నారు.

    అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన సంజయ్ సింగ్‌ను అరెస్టు చేశారని, దేశంలోనే పెద్ద అవినీతిపరుడు మోదీనే అని ఆయన మండిపడ్డారు .

    ఇదిలా ఉండగా, అవినీతి రహిత భారత్ నిర్మాణానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు, ఆప్‌పై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి చేసింది.

    Details

    ప్రజల నమ్మకాన్ని అప్ పార్టీ వమ్ము చేసింది : మనోజ్ తివారీ

    ఈడి ఎక్సైజ్ కేసులో అప్రూవర్లుగా మారడానికి దినేష్ అరోరా, రాఘవ్ మాగుంటలను ఢిల్లీ కోర్టు అనుమతించిన ఒక రోజు తర్వాత సింగ్ అరెస్టు జరగడం గమనార్హం.

    ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తర్వాత మద్యం కుంభకోణంలో అరెస్టయిన రెండో వ్యక్తి సంజయ్ సింగ్. ఫిబ్రవరిలో సిసోడియాను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేసింది.

    బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, బీజేపీ నేతలు భయపడుతున్నారని, బీహార్ లో కూడా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

    ప్రజల నమ్మకాన్ని ఆప్ పార్టీ వమ్ము చేసిందని, ఆప్ నేతలు అవినీతి పరులని ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆరోపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్
    దిల్లీ

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ మద్యం కుంభకోణం: అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా దిల్లీ
    సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా; 2013 నాటి కేజ్రీవాల్ ట్వీట్‌ను వెలికితీసిన బేజేపీ దిల్లీ
    దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం దిల్లీ
    'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం దిల్లీ

    దిల్లీ

    జిల్ బైడెన్‌ కరోనా పాజిటివ్.. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు వస్తారా?  అమెరికా
    జీ20 సమ్మిట్ వేళ.. ఆన్‌లైన్ ఆర్డర్లు, డెలివరీలు, క్లౌడ్ కిచెన్‌లు బంద్  జీ20 సదస్సు
    China roller spoiler: జీ20 సమ్మిట్‌‌లో చైనా పాత్రపై అమెరికా ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు  జీ20 సదస్సు
    G-20 సమావేశం: ప్రపంచ దేశాధినేతల బస ఇక్కడే..ఏ హోటల్లో ఎవరు ఉంటారో తెలుసా ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025