NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ 
    తదుపరి వార్తా కథనం
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ 
    జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ

    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ 

    వ్రాసిన వారు Stalin
    Sep 03, 2023
    10:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.

    ఈ ప్యానెల్‌లో కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరికి కూడా స్థానం కల్పించారు. కమిటీలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ ఒక్కరే కావడం గమనార్హం.

    అయితే తాజాగా అధీర్ రంజన్ చౌదరి కమిటీలో భాగం కావడానికి నిరాకరించారు. ఈ కమిటీని ఒక కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు.

    తాను కమిటీతో కలిసి పనిచేయాడానికి సిద్ధంగా లేనంటూ కేంద్రం హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు.

    ఎన్నికలు

    ఇదొక ప్రభుత్వ ఎత్తుగడ: అధీర్

    ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అనేది రాజ్యాంగపరంగా అనుమానించదగిన, ఆచరణాత్మకంగా సాధ్యం కాని, లాజికల్‌గా అమలు చేయలేని ఆలోచనగా అధీర్ రంజన్ చౌదరి అభివర్ణించారు.

    2024సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలకు ముందు ఈ ప్రణాళికను అమలు చేయడానికి వెనుక ప్రభుత్వం ఎత్తుగడ ఉందని ఆయన అన్నారు.

    రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను కమిటీలో సభ్యుడిగా చేర్చకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని అన్నారు.

    కోవింద్, అమిత్ షా, చౌదరితో పాటు గులాం నబీ ఆజాద్, మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలు ప్రభుత్వ ప్రతిపాదిత కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

    ఎన్నికలు

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో జమిలి ఎన్నికలపై చర్చ

    సెప్టెంబర్ 18నుంచి సెప్టెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో జమిలి ఎన్నికలు(one nation, one election) నిర్వహించే అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

    అయితే ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. సెషన్‌లో ప్రైవేట్ సభ్యుల నోటీసులలపై కూడా ఎలాంటి చర్చలు ఉండవని ఉభయ సభల సెక్రటేరియట్‌లు శనివారం వెల్లడించాయి.

    ఇదిలా ఉంటే, 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అంశం అమలుకు చర్యలు తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

    2019లో మోదీ రెండోసారి గెలిచిన తర్వాత జమిలి ఎన్నికల ఆలోచనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని పిలిచారు. అప్పట్లో కూడా ఈ ఆలోచన సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని పలు ప్రతిపక్షాలు సమావేశాన్ని బహిష్కరించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమిలి ఎన్నికలు
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    ఎన్నికలు
    లోక్‌సభ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    జమిలి ఎన్నికలు

    One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ  అసెంబ్లీ ఎన్నికలు

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    ఎన్నికలు

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ మమతా బెనర్జీ
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ

    లోక్‌సభ

    జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  ప్రహ్లాద్ జోషి
    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    పెట్రోల్ ధరల్లో ఏపీ టాప్.. చమురు ధరల నివేదికను పార్లమెంట్ కు అందజేసిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025