Earthquake: బీహార్లోనూ భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాదిన వరుస భూకంపాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున దిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.
ఆ తర్వాత, కొద్దిసేపటికి బిహార్ రాష్ట్రంలో మరో భూకంపం సంభవించింది.
ఉదయం 8:02 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయి.
రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
సివాన్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రకంపనలకు సంబంధించి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం ఇంకా తెలియరాలేదు.
ముందుగా, తెల్లవారుజామున 5:35 గంటల సమయంలో దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ ప్రాంతాల్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మోదీ
కొద్ది సెకన్ల పాటు భూమి తీవ్రంగా కంపించడం వలన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆ సమయంలో భారీ శబ్దం వినిపించినట్లు కొంతమంది స్థానికులు తెలిపారు. అపార్ట్మెంట్లు, విద్యుత్ స్తంభాలు ఊగిపోతున్నట్లు చెబుతున్నారు.
దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, దిల్లీలో మళ్లీ ప్రకంపనలు రావచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా చర్యలను పాటించాలనీ కోరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నేషనల్ సెంటర్ గోర్ సీస్మోలోజి చేసిన ట్వీట్
An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit Siwan, Bihar at 08:02 IST today
— ANI (@ANI) February 17, 2025
(Source - National Center for Seismology) pic.twitter.com/mNcVErOpq6