NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra News: వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జీఎస్‌డీపీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra News: వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జీఎస్‌డీపీ 
    వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌.

    Andhra News: వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జీఎస్‌డీపీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 07, 2025
    09:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక ప్రగతిలో మరోసారి తన స్థానాన్ని దక్కించుకున్నఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం,2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో రెండో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది.

    కేంద్ర గణాంకాలు,కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఏపీ రాష్ట్ర వృద్ధి రేటు 8.21 శాతంగా నమోదై దేశంలో రెండో స్థానాన్ని సంపాదించింది.

    తమిళనాడు 9.69 శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది.

    MoSPI విడుదల చేసిన వివరాల ప్రకారం,18 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP),తలసరి ఆదాయం (PCI) గణాంకాలు వెల్లడించబడ్డాయి.

    స్థిర ధరల ప్రకారం (2011-12 ధరల ప్రాతిపదికన) ఏపీ GSDP రూ. 8,65,013 కోట్లకు చేరింది.

    వివరాలు 

    ప్రస్తుత ధరల ప్రాతిపదికన ప్రగతి 

    2023-24లో ఇది రూ. 7,99,400 కోట్లుగా ఉంది, అంటే ఆ సంవత్సరం వృద్ధి రేటు 6.19 శాతంగా ఉండేది.

    ప్రస్తుత ధరలతో లెక్కించితే, ఏపీ 12.02 శాతం వృద్ధి సాధించి దేశంలో ఐదో స్థానంలో నిలిచింది.

    మొదటి నాలుగు స్థానాల్లో తమిళనాడు (14.02%), ఉత్తరాఖండ్‌ (13.59%), కర్ణాటక (12.77%), అస్సాం (12.74%) నిలిచాయి.

    ఆంధ్రప్రదేశ్‌కు తర్వాత రాజస్థాన్‌ (12.02%), హర్యానా (11.83%), మహారాష్ట్ర (11.73%), మేఘాలయ (11.63%) జమ్మూ కశ్మీర్‌ (11.19%) ఉన్నారు.

    తెలంగాణ 10.12 శాతం వృద్ధితో 14వ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ధరల ప్రాతిపదికన ఏపీ GSDP రూ. 15,93,062 కోట్లకు చేరింది.

    వివరాలు 

    రంగాల వారీగా వృద్ధి విశ్లేషణ 

    వ్యవసాయ రంగం: వ్యవసాయ,అనుబంధ రంగాలు అత్యద్భుతమైన పురోగతిని చూపాయి.

    ఈ రంగాలు కలిపి 2024-25లో 15.41% వృద్ధిని సాధించాయి.ఇందులో వ్యవసాయ రంగం 22.98%, ఉద్యానవన శాఖ 21.29% వృద్ధిని నమోదు చేశాయి.

    గత ఏడాది వ్యవసాయ రంగానికి తక్కువ బేస్‌ ఉండటంతో ఈ ఏడాది అధిక వృద్ధి నమోదైంది.

    ఉద్యానరంగం రాష్ట్ర వృద్ధిలో ముఖ్య భూమిక పోషించింది.

    పారిశ్రామిక రంగం: పారిశ్రామిక రంగం 6.41 శాతం వృద్ధితో కొంత మందగించినట్టే కనిపించింది.

    అయితే నిర్మాణ రంగం 10.28%,తయారీ రంగం 5.80% వృద్ధి సాధించాయి.

    సేవల రంగం: సేవల రంగం 11.82% వృద్ధితో ఆకర్షణీయమైన ప్రగతిని నమోదు చేసింది.ఇందులో ఇతర సేవలు 12.15%,వాణిజ్యం-హోటళ్లు-రెస్టారెంట్లు 11.58%, స్థిరాస్తి, ఇళ్ల నిర్మాణ రంగం 11.22% వృద్ధి సాధించాయి.

    వివరాలు 

    తలసరి ఆదాయంలో వృద్ధి 

    2024-25లో తలసరి ఆదాయం 11.89 శాతం పెరిగి ఏపీ దేశంలో మూడో స్థానంలో నిలిచింది.

    తమిళనాడు (13.58%) మొదటి స్థానంలో, కర్ణాటక (12.09%) రెండో స్థానంలో నిలిచాయి.

    ఆ తర్వాత ఉత్తరాఖండ్‌ (11.33%), రాజస్థాన్‌ (11.04%), మహారాష్ట్ర (11%), జమ్మూ కశ్మీర్‌ (10.60%), ఒడిశా (10.59%), హర్యానా (10.59%) అస్సాం (10.33%) ఉన్నాయి.

    తెలంగాణ 9.61 శాతం వృద్ధితో 11వ స్థానంలో ఉంది. ఏపీ తలసరి ఆదాయం రూ. 2,66,240 గా నమోదైంది.

    వివరాలు 

    "ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా సాగుతోంది" - సీఎం చంద్రబాబు 

    ''ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది.2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 8.21 శాతం వృద్ధితో దేశంలో రెండో స్థానాన్ని సాధించింది. మా ప్రభుత్వం ఏర్పడి కేవలం ఒకే సంవత్సరంలో, మా అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని సంక్షోభ స్థితి నుంచి ముందుకు నడిపించాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. వ్యవసాయ, తయారీ, సేవల రంగాల్లో విస్తృత పునరుద్ధరణ వల్ల ఇది సాధ్యమైంది. ఈ విజయానికి కారకమైన రాష్ట్ర ప్రజలందరినీ అభినందిస్తున్నాను. మనం అందరం కలిసి భవిష్యత్‌ అభివృద్ధికి నడక కొనసాగిద్దాం,'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

    ఈ ట్వీట్‌కు MoSPI గణాంకాల లింక్‌ను కూడా జత చేశారు.

    వివరాలు 

    "ఆర్థిక స్థిరత్వం వైపు రాష్ట్రం పయనిస్తోంది" - మంత్రి నారా లోకేశ్‌ 

    మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ, రాష్ట్రానికి 2024-25లో 8.21 శాతం వృద్ధి రేటు దక్కడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. గత ఏడాది 6.18 శాతం మాత్రమే ఉండగా, ఈసారి అధిక వృద్ధి సాధించగలగడం రాష్ట్రానికి ఉన్న దూరదృష్టి గల నాయకత్వానికి, ఆర్థిక క్రమశిక్షణకు, మంచి పరిపాలనకు నిదర్శనమని వివరించారు. ''సహేతుక సంస్కరణలు చేపట్టిన చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది'' అని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Heat Waves: రాష్ట్రంలో ఎండల తీవ్రత.. నాతవరంలో 42.1 డిగ్రీలకు తాకిన ఉష్ణోగ్రత  భారతదేశం
    Andhra Pradesh: ఐదేళ్లలో తొలిసారి విద్యుత్ ఛార్జీలలో తగ్గింపు.. ట్రూడౌన్‌ ప్రకటన! విద్యుత్
    AP cabinet: చేనేత, పవర్ లూమ్ రంగాలకు ఉచిత విద్యుత్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! చంద్రబాబు నాయుడు
    Andhra News:  ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025