NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Rains: ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోకూడిన వర్షం.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Rains: ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోకూడిన వర్షం.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
    ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోకూడిన వర్షం.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..

    AP Rains: ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోకూడిన వర్షం.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్'లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు తీవ్రంగా పడుతున్నాయి.ఆదివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

    గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలతో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారాయి.

    ఈ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

    ఆ సమయంలో పంటలు, ముఖ్యంగా ధాన్యం, మరికొన్ని పంటలు తీవ్రంగా నష్టపోయాయి.

    గాలివాన బీభత్సంతో పాటు, పిడుగులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ దృష్ట్యా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

    వివరాలు 

    తీవ్రంగా నష్టపోయిన అరటి, బొప్పాయి, మామిడి రైతులు

    ఏపీలో ఈ విపరీతమైన వాతావరణం కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

    వీరిలో పిడుగుల కారణంగా 7 మంది మరణించగా, చెట్టు కూలి ఒకరు మరణించారు.

    పిడుగులు, బలమైన గాలులతో భయానక పరిస్థితులు ఏర్పడటంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు.

    తిరుపతి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు.

    ఏలూరు జిల్లాలో పిడుగుపాటుతో ఒకరు మరణించారు, మరోరు చెట్టుపై పడటం వలన మరణించారు.

    చాలా మంది గాయపడినట్లు కూడా సమాచారం అందింది. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది, అలాగే అరటి, బొప్పాయి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

    వివరాలు 

    ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

    పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా(ఏపీ)వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

    ఈ ప్రభావం వల్ల కోస్తా ప్రాంతాల్లో సోమ,మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

    అల్లూరి సీతారామరాజు,తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

    ఈ క్రమంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సూచించింది.

    మే 10 తరువాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాతావరణ శాఖ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    వాతావరణ శాఖ

    Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణ
    Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు బంగాళాఖాతం
    AP Rains: బంగాళాఖాతంలో తుపాన్ల ముప్పు.. రాష్ట్రంలో రక్షణ చర్యలు అవసరం  బంగాళాఖాతం
    IMD: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు ఐఎండీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025