English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 26, 2024
    09:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి అవసరమైన సాయం గురించి ప్రస్తావించారు.

    వైసీపీ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్తం చేసి, ఐదేళ్లకు రావాల్సిన రెవెన్యూలోటు గ్రాంటును మూడేళ్లలోనే ఉపయోగించడాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం అవసరమని చంద్రబాబు ప్రధానమంత్రిని కోరారు.

    స్వర్ణాంధ్ర విజన్‌ - 2047ను ప్రధానమంత్రికి అందజేత

    వాజ్‌పేయీ శతజయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి దిల్లీలో ఉన్న చంద్రబాబు, స్వర్ణాంధ్ర విజన్‌ - 2047 గురించి ప్రధానమంత్రికి వివరించారు.

    రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం తరఫున అన్నిరకాలుగా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వచ్చే నెలలో ప్రారంభించే భారీ ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రితో చర్చించారు.

    Details

     ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చ 

    చంద్రబాబు, పోలవరం, అమరావతి ప్రాజెక్టుల పురోగతి గురించి ప్రధానమంత్రికి వివరించారు.

    గతంలో వైసీపీ ప్రభుత్వం 94 కేంద్ర పథకాల అమలును నిలిపి వేయడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించారు.

    పునఃప్రారంభమైన 74 పథకాలకు కేంద్రం పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరారు.

    అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముడిఖనిజం సరఫరా, అవసరమైన అనుమతులు త్వరగా లభించేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    Details

    కేంద్రమంత్రులతో సమావేశాలు 

    హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లతో వేర్వేరుగా సమావేశమై రాష్ట్రానికి తగిన నిధులు వచ్చే బడ్జెట్‌లో చేర్చాలని కోరారు.

    బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో విశాఖ ఉక్కు పునరుజ్జీవం కోసం కేంద్రం చేయాల్సిన సాయంపై చర్చించారు.

    రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో రైల్వే ప్రాజెక్టుల వేగవంతం, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, విశాఖ రైల్వే జోన్ ప్రారంభంపై చర్చలు జరిగాయి.

    ఎన్డీయే పక్షాల సమన్వయం

    ఎన్డీయే పక్షాల సమావేశంలో పార్టీల మధ్య సమన్వయంతో పని చేయడం, కేంద్ర పథకాల అమలు వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.

    'వికసిత్‌ భారత్‌ 2047' లక్ష్యాన్ని సాధించడానికి ఎన్డీయే కట్టుబడి ఉందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    Details

    వాజ్‌పేయీకి నివాళి 

    మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీని భారతజాతి గర్వించదగ్గ నేతగా చంద్రబాబు కొనియాడారు. ''నేషన్‌ ఫస్ట్'' అనే దృక్పథంతో ఆయన సేవలు చేసిన తీరు చిరకాలం గుర్తుండిపోతుందని చెప్పారు.

    12 గంటలపాటు నిరవధిక కృషి

    ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 వరకు చంద్రబాబు ఢిల్లీలో తీరిక లేకుండా పర్యటించారు.

    వాజ్‌పేయీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించడంతో ప్రారంభమైన ఈ పర్యటన, వివిధ నాయకులు, కేంద్రమంత్రులతో సమావేశాల ద్వారా కొనసాగి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీతో ముగిసింది.

    ఈ పర్యటనలో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలకమైన అంశాలను చర్చిస్తూ కేంద్రం నుంచి అవసరమైన సహాయాన్ని అందించేందుకు మరింత సమన్వయం చేశారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్
    నరేంద్ర మోదీ

    తాజా

    Raghurama: డీజీపీకి రఘురామ లేఖ.. సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద చర్యల డిమాండ్! ఆంధ్రప్రదేశ్
    Bengaluru Stampede: ప్రభుత్వ ప్రోత్సహంతోనే ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మానం.. గవర్నర్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    India's poverty: దేశంలో క్రమంగా తగ్గుతున్న పేదరికం.. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    Harish Rao: హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట.. ఎన్నికల పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం బీఆర్ఎస్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: భవిష్యత్తులో డ్రోన్ ఓ గేమ్ చేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    Andhrapradesh: ఉత్తరాంధ్ర, కోస్తా చెరువుల్లో జలకళ.. రాష్ట్రంలో 840 టీఎంసీల నీటి నిల్వ.. సీఎంకి జలవనరులశాఖ నివేదిక ఆంధ్రప్రదేశ్
    Chandrababu: రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం: చంద్రబాబు  భారతదేశం
    CM Chandrababu: వచ్చే నెలలో పోలవరానికి చంద్రబాబు.. జలవనరులశాఖ ప్రాజెక్టులపై సమీక్ష పోలవరం

    ఆంధ్రప్రదేశ్

    Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్‌ వ్యవస్థ.. విద్యా ప్రమాణాలపై మంత్రి లోకేశ్ ఫోకస్  నారా లోకేశ్
    Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు.. రుణసాయం ఒప్పందానికి ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఆమోదం  భారతదేశం
    Rain Alert : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడూ స్కూళ్లకు సెలవు   భారతదేశం
    AndhraPradesh: రూ.6,200 కోట్లతో హోటళ్లు, రిసార్ట్‌ల రంగంలో పెట్టుబడులు భారతదేశం

    నరేంద్ర మోదీ

    PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ నితీష్ కుమార్
    Nitish-Modi: మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన బిహార్ సీఎం నీతీశ్‌.. వీడియో వైరల్ నితీష్ కుమార్
    Modi regime: 'మధ్యతరగతిపై పన్ను తగ్గిన భారం'.. మోదీ పాలనలో 5 రెట్లు పెరిగిన రూ.50 లక్షల ఆదాయం  పన్ను
    PM Modi: ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ కాలేదు జార్ఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025