NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం
    మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం

    Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 09, 2024
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కొనసాగిస్తున్న పథకాల్లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టంది.

    ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, స్వయం సహాయక బృందాలకు రుణాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మరో ముందడుగు వేస్తోంది.

    రేవంత్ రెడ్డి సర్కార్‌ మహిళా సంఘాల బలోపేతం కోసం కీలక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

    ప్రభుత్వం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, వారి ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించాలని భావిస్తోంది.

    ఆ బస్సులను ఆర్టీసీకి అద్దె పద్ధతిలో అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకాన్ని మొదట మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావించారు.

    Details

    బస్సుల కొనుగోలులో భాగస్వామ్యం చేయాలి

    ప్రస్తుతం ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయాలని యోచిస్తోంది.

    ప్రభుత్వంపై భారం తగ్గించేందుకు, స్వయం సహాయక సంఘాలను బస్సుల కొనుగోలులో భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారు.

    రైతులకు పంటతో పాటు మరొక ఆదాయం వచ్చేలా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

    పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

    Details

    సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రణాళికలు

    ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు సోలార్ పంప్ సెట్లు అందించడం ద్వారా, రైతులు పంటతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేయగలరు.

    పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.

    ఇందుకు అవసరమైన బడ్జెట్‌ ఇప్పటికే కేటాయించామని, ట్రాన్స్‌ఫార్మర్ల అవసరాలను తీర్చేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

    అదనంగా గ్రామాల్లో ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    రేవంత్ రెడ్డి

    తాజా

    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ
    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ

    తెలంగాణ

    CM Revanth Reddy: నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం పెద్దపీట.. స్కిల్‌ యూనివర్సిటీకి 150 ఎకరాలు, రూ.100 కోట్లు  భారతదేశం
    Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం .. కీలక అంశాలపై చర్చ రేవంత్ రెడ్డి
    Hydra: హైడ్రా విస్తరణకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బెంబేలెత్తుతున్న రియల్‌ ఎస్టేట్‌ మాఫియా  హైదరాబాద్
    Hydra: మాదాపూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ కూల్చివేత  హైదరాబాద్

    రేవంత్ రెడ్డి

    TG Panchayat Elections: తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లకు షెడ్యూల్ ఖరారు  తెలంగాణ
    Telangana: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకు ప్రత్యేక స్థానం తెలంగాణ
    Revanth Reddy : 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ గేమ్స్ : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్
    CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025